Kumaraswamy: హైదరాబాద్కు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు: కేంద్రమంత్రి కుమారస్వామి

Kumaraswamy announced that 2,000 electric buses will be allocated to Hyderabad: కేంద్రమంత్రి కుమారస్వామి హైదరాబాద్కు గుడ్న్యూస్ చెప్పాడు. హైదరాబాద్ నగరానికి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కేంద్రమంత్రి గురువార ఒక ప్రకటన చేశారు. ఈ-డ్రైవ్ పథకం కింద బస్సులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పీఎం ఈ-డ్రైవ్ కింద 11వేల ఈ-బస్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుమారు 11వేల ఈ-బస్సులను ఐదు నగరాలకు కేటాయిస్తామన్నారు.
బెంగళూరుకు 4,500 బస్సులు, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్కు 1000 బస్సులు కేటాయించినట్లు ఆయన వివరించారు. సూరత్కు 600 బస్సులు కేటాయిస్తామని తెలిపారు. మొత్తం 14,028 బస్సులను కేటాయించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన మంత్రి ఈ-డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్రం రూ.10,900 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.