Last Updated:

Atiq Ahmed’s vote: అతిక్ అహ్మద్ ఓటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడిందా?

ఉత్తరప్రదేశ్ లో శనివారం కాల్చి చంపబడిన అతిక్ అహ్మద్‌ 2008లో పార్లమెంట్ సభ్యుడిగా తన ఓటుతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కాపాడారా? అంటే అవుననే తెలుస్తోంది. రాజేష్ సింగ్ రచించిన మరియు రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం బాహుబలిస్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్: ఫ్రమ్ బుల్లెట్ టు బ్యాలెట్.. యుపిఎ ప్రభుత్వాన్ని పతనం నుండి రక్షించిన వారిలో అతిక్ అహ్మద్ ఉన్నారని చెబుతోంది.

Atiq Ahmed’s vote: అతిక్ అహ్మద్ ఓటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడిందా?

Atiq Ahmed’s vote: ఉత్తరప్రదేశ్ లో శనివారం కాల్చి చంపబడిన అతిక్ అహ్మద్‌ 2008లో పార్లమెంట్ సభ్యుడిగా తన ఓటుతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కాపాడారా? అంటే అవుననే తెలుస్తోంది. రాజేష్ సింగ్ రచించిన మరియు రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం బాహుబలిస్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్: ఫ్రమ్ బుల్లెట్ టు బ్యాలెట్.. యుపిఎ ప్రభుత్వాన్ని పతనం నుండి రక్షించిన వారిలో అతిక్ అహ్మద్ ఉన్నారని చెబుతోంది.

అణు ఒప్పందాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయంపై వామపక్షాలు 2008 మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ కు తాము బయటి నుంచి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీనితో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అప్పటికి యుపిఎ లోక్‌సభలో 228 మంది సభ్యులను కలిగి ఉంది. విశ్వాస సంక్షోభాన్ని అధిగమించడానికి సాధారణ మెజారిటీకి 44 సీట్లు తక్కువగా ఉన్నాయి. అయితే తాము మనుగడ సాగిస్తామని ప్రధాని సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ విశ్వాసం ఎక్కడికి వచ్చిందో త్వరలోనే స్పష్టమైందని రాజేష్ సింగ్ రాసారు.

యుపిఎ కు ఓటు వేసిన అతిక్ అహ్మద్ ..(Atiq Ahmed’s vote)

అజిత్ సింగ్ యొక్క రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) మరియు దేవెగౌడ యొక్క జనతాదళ్ (సెక్యులర్), సమాజ్ వాదీ పార్టీ యుపిఎ కు కూడా మద్దతునిచ్చాయని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం అందరిమాదిరే ఆరుగురు పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే వీరికున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆరుగురిపై 100కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలోఅలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్) ఫుల్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అప్పటి సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ ఎంపీ అతిక్ అహ్మద్ కూడా ఉన్నారు. కేవలం 48 గంటల వ్యవధిలో వీరు తాము శిక్ష అనుభవిస్తున్న జైళ్లనుంచి విడుదలయి ఓటు వేయడానికి వచ్చారు. వీరు యుపిఎ కు ఓటు వేసి ప్రభుత్వం కూలిపోకుండా ఉండటంలో తమ వంతు పాత్ర పోషించారు.

అతిక్ అహ్మద్ (60) తనను తాను రాజకీయవేత్తగా, కాంట్రాక్టర్‌గా, బిల్డర్‌గా, ప్రాపర్టీ డీలర్‌గా మరియు వ్యవసాయదారుడిగా పేర్కొనేవాడు. అయితే అతనిమీద కిడ్నాప్, దోపిడీ మరియు హత్య వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. 100కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.