Last Updated:

BMC Covid Scam..బీఎంసీ కోవిడ్ స్కామ్.. నలుగురు సభ్యుల సిట్ ను నియమించిన ముంబై పోలీసులు

బృహన్‌ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ) లో కోవిడ్-19 సమయంలో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

BMC Covid Scam..బీఎంసీ కోవిడ్ స్కామ్.. నలుగురు సభ్యుల సిట్ ను నియమించిన ముంబై పోలీసులు

BMC Covid Scam..బృహన్‌ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ) లో కోవిడ్-19 సమయంలో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

ఈడీ సోదాలు..(BMC Covid Scam)

ఈ బృందానికి ముంబై పోలీసు కమీషనర్ నాయకత్వం వహిస్తారు, వీరితో పాటు ఆర్థిక నేరాల విభాగం జాయింట్ కమిషనర్ (EOW), డిప్యూటీ కమిషనర్ (DCP) మరియు EOW అసిస్టెంట్ కమిషనర్ (ACP) ఉంటారు.కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఈ కుంభకోణంపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.ముంబైలోని సంజీవ్ జైస్వాల్, సరఫరాదారులు మరియు ఐఏఎస్ అధికారులతో సహా కొంతమంది బీఎంసీఅధికారులు, వ్యాపారవేత్త సుజిత్ పాట్కర్, సూరజ్ చవాన్ మరియు శివ సన్నిహితులుగా చెప్పబడుతున్న ఇతరుల స్థలాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 15 కంటే ఎక్కువ ప్రదేశాలలో దాడులు నిర్వహించిన తర్వాత ఇది జరిగింది. సోదాల సమయంలో మహారాష్ట్ర వ్యాప్తంగా రూ. 68.65 లక్షల నగదు, 50కి పైగా స్థిరాస్తులు (అంచనా మార్కెట్ విలువ రూ. 150 కోట్లకు పైగా) వెల్లడించిన పత్రాలు, రూ. 15 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు/పెట్టుబడులు, రూ. 2.46 విలువైన ఆభరణాలతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.

మహమ్మారి సమయంలో కోవిడ్ -19 ఫీల్డ్ ఆసుపత్రులను నిర్వహించడం కోసం పాట్కర్ మరియు అతని ముగ్గురు భాగస్వాములు మోసపూరితంగా ముంబై పౌర సంస్థ కాంట్రాక్టులను పొందారని అధికారులు పేర్కొన్నారు. లైఫ్‌లైన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ పాట్కర్ మరియు అతని ముగ్గురు భాగస్వాములపై ఇక్కడి ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ గత ఏడాది ఆగస్టులో ఫోర్జరీ కేసు నమోదు చేసింది.