Meghalaya Honeymoon Case: హనీమూన్ యాత్ర విషాదం.. రఘువంశీ, సోనమ్ల పెళ్లి రీల్ వైరల్!
Big Twist in Meghalaya Honeymoon Case: మేఘాలయలో మిస్ అయిన హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు పురోగతి సాధించారు. ఈస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో నవ వరుడు రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. అయితే అతని శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు తేల్చగా.. హత్యగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్కు చెందిన ఈ జంటకు మే 11 న వివాహం జరగగా.. 23వ తేదీ నుంచి ఆచూకీ లభించలేదు.
ఈ కేసు విచారణలో పోలీసులకు అసలు విషయం తెలిసింది. రఘువంశీ భార్య సోనమ్ ఆచూకీ కోసం గలించారు. అయితే భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ చంపినట్లు పోలీసులు తేల్చారు. పోలీసులు ఆమెతో పాటు మరో నలుగురికి యూపీలోని ఘాజీపూర్లో అరెస్ట్ చేశారు. భర్తను హత్య చేసేందుకు ఆమె కొంతమందికి సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు.
అయితే తాజాగా, రాజా రఘువంశీ, సోనమ్ల వివాహం రీల్ వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమాల్లో రఘువంశీ చాలా సంతో షంగా ఉన్నారు. వివాహ కార్యక్రమాల్లో భాగంగా తర సోదరి, భార్యతో కలిసి వీడియోలు తీసుకున్నారు.ఈ వీడియోలో తన భార్య సోనమ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు నటించింది. కాగా, సోనమ్, కుశ్వాహాలు ప్రేమించుకున్నారని. అందుకే ఆమె చంపేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది. భర్తను చంపిన తర్వాత ఆమె వితంతుగా మారితే తన తల్లిదండ్రులు ప్రియుడు కుశ్వాహకు ఇచ్చి వివాహం చేస్తారని సోనమ్ స్కెచ్ వేసింది. కానీ చివరిలో ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు.
View this post on Instagram