Home / ప్రాంతీయం
తెలుగుదేశం నేతలు ఛలో అసెంబ్లీకి పిలుపు నివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసరాలలోనూ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోనూ డ్రోనులను తిప్పతూ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసుల పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అయినా కానీ పట్టువిడువని విక్రమార్కుల్లా తెదేపా నేతలు అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి నిరసన చేపట్టారు.
ఈ మధ్యకాలంలో సాయం చెయ్యడం కూడా తప్పు అయిపోయింది. ఏదో పాపాం కదా అని సహాయం చెయ్యాలని చూసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వ్యవస్ధల్లో నూతన వరవడిని సృష్టించాలంటే భారత రాజ్యాంగంలో అనేక సంస్కరణలు, మార్పులు అవసరమంటూ అనేక మంది రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. వారందరికి బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చెక్ పెట్టారు
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసి శుభవార్త చెప్పింది. సాధారణ చార్జీలతో వారి వారి స్వస్ధలాలకు వెళ్లవచ్చని తీపి కబురు అందించింది.
తెలంగాణ పండుగల్లో ప్రజలు ఆరాధించుకొనే పండుగల్లో బతుకమ్మ ఉత్సవాలు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా బతుకమ్మ పండుగను చేపడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తుంటుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు ఓకే చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల కమీషన్ కు సర్వోత్తమ న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం భాగ్యనగరాన్ని కుదిపేస్తుంది. నగరంలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. సభలో కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సస్పెన్షన్ తీర్మానం ప్రతిపాదించగా, స్పీకర్ వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.