Home / ప్రాంతీయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ కాలేజీ చేపట్టనున్నారు . కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సభ అనుమతి కోసం ఈ నెల 23న అనుమతిని తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ 25 న నోటీసులు పంపించారు .
తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఒక ట్రయల్ కోర్టు శుక్రవారం పాజీ ఫారెక్స్ సంస్థల డైరెక్టర్లు కె మోహన్రాజ్ మరియు కమలవల్లికి 27 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 171.74 కోట్ల సామూహిక జరిమానా విధించింది. వీరు రూ. 870.10 కోట్ల మేరకు డిపాజిటర్లనుమోసం చేసారు.
బండి సంజయ్ మూడో విడత పాద యాత్ర ముగింపు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్గా నియమితులైన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొననున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం .
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో లో మూడో రోజు పర్యటిస్తున్నారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు.
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్కు ఊరట లభించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తనకు బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది.
వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతిచ్చింది. సభకు ప్రిన్సిపాల్ అనుమతి నిరాకరించడంపై బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు సభకు నిర్వహించుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ నేతలు సభకు భారీ ఏర్పట్లు చేస్తున్నారు.
ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా, ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే, ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు.
ఏపీలో ఈ ఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రక్రియను కన్వీనర్ పోలా భాస్కర్ షెడ్యూల్ ప్రక్రియను ఆగష్టు 22న విడుదల చేసారు. ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు సంబంధించిన ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుంది.
హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగే సభకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. పోలీసుల తీరును సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రేపు ఆర్ట్స్ కళాశాలలో బీజేపీ సభ జరగాల్సి ఉంది.