Home / ప్రాంతీయం
హైదరాబాద్ జ్యోతిరావు పులే భవన్ ( ప్రగతి భవన్ )లో ప్రజా దర్భార్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకుని ఆయా శాఖల అధికారులకు పంపించి.. పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
మాజీ సీఎం కేసీఆర్ నిన్న రాత్రి ప్రమాదవ శాత్తూ కింద పడటంతో.. కాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో ఆయన్ను హుటా హుటిన హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు తుంటి ఎముకకు గాయం కావడంతో సర్జరీ చేయాలని యశోద వైద్యులు నిర్ణయించారు.
అత్తారింటికి దారేదో తెలిసింది కానీ.. ఏపీ రాజధానికి దారి తెలియడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని ఎక్కడుందో కేంద్రంలో ఉన్నవాళ్లు చెప్పాల్సి వస్తోందని అన్నారు. ఈ రోజుకు ఏపీకి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఏందపి పవన్ మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం తొలిసారి సచివాలయానికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు సచివాలయం చేరుకున్నారు. రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పండితుల ఆశీర్వచనం అందించారు.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ ప్రారంభమయింది.
తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పోరాటాలతో, త్యాగాలే పునాదిగా ఏర్పడిన రాష్ట్రమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రమంతా సమానమైన అభివృద్ది చేయాలన్న సోనియా గాంధీ సంకల్పంతో తెలంగాణ ఏర్పడింది. కాని దశాబ్దకాలం మానవహక్కులకు చోటు లేకుండా పోయిందన్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.రేవంత్ రెడ్డితో పాటు మిగతా 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటా నాలుగు నిమిషాలకి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిని ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిఎడి ప్రొటోకల్ డిపార్ట్మెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంటలకు అపార నష్టం జరిగింది... వర్షం కారణంగా మిరప పంట నీట మునిగింది. మరో వారం రోజులలో మొదటి కోతకు రైతు సిద్ధపడిన సమయంలో మిచౌంగ్ తుఫాను రైతుకు కన్నీరు మిగిల్చింది.పంట సాగుకోసం చేసిన అప్పులు మాత్రం మిగిలాయని, పంట మాత్రం చేతికి రాలేదని రైతులు అంటున్నారు.చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతన్న ఆవేదనకు అంతు లేకుండా పోయింది.