Home / ప్రాంతీయం
: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాను మరో రెండు గంటల్లో బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి సుమారు 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ కారణంగా బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది.
మిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.కోతకి వచ్చిన ఖరీఫ్ పంటని కాపాడుకోవడంమిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు. పలువురు ఓఎస్డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు గుడ్బై చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ హెటల్ ఎల్లాలో సీఎల్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసారు. రేవంత్ రెడ్డి దీనిపై తీర్మానం ప్రవేశపెట్టగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిని బలపరిచారు
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం నేపధ్యంలో ఏపీలోని దక్షిణ కోస్తాకి రెడ్ అలెర్ట్ ప్రకటించారు.చెన్నైకి 130కిలో మీటర్లు, నెల్లూరుకు 220 కిలో మీటర్లు. బాపట్లకు 330 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 350 కిలో మీటర్ల దూరంలో మిచౌంగ్ కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంలో వాయవ్య దిశగా తుఫాను కదులుతోంది
కాంగ్రెస్ చేతిలో పార్టీ పరాజయం పాలైనందుకు తీవ్ర నిరాశకు లోనయినా చింతించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్ ) అన్నారు. ప్రజాతీర్పును శిరసావహించి సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసారని అన్నారు.
ప్రగతి భవన్ పేరును ఇకపై బిఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అద్బుతమైన తీర్పు ఇచ్చారంరటూ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం గేట్లు ఇకపై సాధారణ ప్రజలకు కూడా తెరిచి ఉంటాయని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖరారవడంతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. సాధారణంగా ఇటువంటి సందర్బాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ ను కలిసి తమ రాజీనామా లేఖను పంపిస్తారు.