Home / ప్రాంతీయం
అదిలాబాద్ రిమ్స్లో రాత్రి వైద్య విద్యార్థులను బయటి వ్యక్తులు వచ్చి కొట్టడాన్ని నిరసిస్తూ రిమ్స్ విద్యార్థులు ప్రధాన గేట్ ముందర ధర్నాకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ దిష్టి బొమ్మను విద్యార్థులు దహనం చేశారు. తమ వార్డుల్లో సరైన సదుపాయాలు లేవని నిన్న సాయంత్రం డైరెక్టర్తో గట్టిగా మాట్లాడితే ఇలా రౌడీలను తీసుకువచ్చి దాడులు చేపియిస్తారా అని బాధితుడు కవిరాజు నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబసమేతంగా గురువారం తెల్లవారు జామున గృహప్రవేశం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రాలతో ఆర్థిక, ఇంధన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పుంగనూరు మంత్రి పెద్ది రెడ్డి జాగీరా అంటూ ఆయన ప్రశ్నించారు.
భూములకి సంబంధించిన ధరణి పోర్టల్పై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ధరణి యాప్ భద్రతపై సిఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆరా తీశారు. ధరణిలో ఉన్న లోటుపాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ చేసినట్టు.. ప్రభుత్వ భూములను సీఎం జగన్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా షామీర్ పేట పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని 33, 34, 35 సర్వ్ నెంబర్ లోగల 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ స్పీకర్ పదవికి మరి కాంగ్రెస్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఎన్నికకి సహకరించాలని ప్రతిపక్ష బిఆర్ఎస్ నిర్ణయించింది. ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సైతం కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అలవిగానీ హామీలు ఇచ్చారని, ఇద్దరినీ తాము ఎందుకు వదిలి పెడతామని మీడియాతో జరిగిన చిట్చాట్లో కేటీఆర్ ప్రశ్నించారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
పది రోజుల వరకు తనను కలిసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలను కోరారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇతర రోగులకు అసౌకర్యం కలుగుతుందని అందువలన ఎవరూ తనను పరామర్శించేందుకు రావద్దని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేసారు.