Last Updated:

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్  స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఉపవాస దీక్షలో ఉన్న కారణంగా.. నీరసంగా ఉండడంతోనే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది.

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్  స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఉపవాస దీక్షలో ఉన్న కారణంగా.. నీరసంగా ఉండడంతోనే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయన పెదఅమిరంలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాలులో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

కాగా ఈ నేపథ్యంలో ఈ ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత భేటీ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా పలు పార్టీలకు చెందిన నేతలు నేడు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు.

వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా జూన్ 20 నుంచి పవన్ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోరని.. కేవలం పాలు, పండ్లను మాత్రమే తిసుకుంటారని చెబుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఆయన తరచూ అస్వస్థతకు గురి అవుతున్నారని పవన్ కళ్యాణ్ సన్నిహితులు వాపోయారు.