Last Updated:

Kamareddy Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

Kamareddy Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు వినిపించిన.. ప్రభుత్వ తరపు న్యాయవాది.. మాస్టర్ ప్లాన్ ను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని కోర్టుకు వివరించారు.

Kamareddy Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

Kamareddy Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు వినిపించిన.. ప్రభుత్వ తరపు న్యాయవాది.. మాస్టర్ ప్లాన్ ను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని కోర్టుకు వివరించారు.

 

మాస్టర్ ప్లాన్ ను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకున్న అంశంపై.. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హై కోర్టుకు తెలిపారు.

టౌన్ ప్లానింగ్ చట్టం సెక్షన్14 ప్రకారం ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని తెలిపారు.

మాస్టర్ ప్లాన్ ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయమని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

ప్రస్తుతానికి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వం దీనిపై ఇంకా స్పందించలేదని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఆ వివరాలను సమర్పిస్తామని తెలిపారు.

దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఈ మాస్టర్ ప్లాన్ అంశంపై తదుపరి విచారణనను ఫిబ్రవరి 22కి హై కోర్టు వాయిదా వేసింది.

కామారెడ్డి మాస్టార్ ప్లాన్ (Kamareddy Plan) రాష్ట్రంలో తీవ్ర చర్చంనీయాంశమైంది. ఈ ప్లాన్ ను రద్దు చేయాలంటూ.. కామారెడ్డి, జగిత్యాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ వివాదం మరింత ముదరడంతో.. ప్లాన్ ను రద్దు చేస్తున్నామని మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వెల్లడించారు.

దీంతో పాత ముసాయిదా డ్రాఫ్ట్ ను రద్దు చేస్తున్నట్టు పాలక వర్గం నిర్ణయం తీసుకుంది.

మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ 6 గ్రామాల రైతులు, గ్రామస్తులు వారం రోజులుగా ఆందోళనలు చేశారు.

గత డిసెంబర్ 15 న మాస్టర్ ప్లాన్ ముసాయిదా నోటిఫికేషన్ వెలువడింది. కామారెడ్డి ఇండ్రస్టియల్ జోన్ మాస్టర్ ప్లాన్లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన 8 గ్రామాలను చేర్చారు.

ఈ గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు.

మొత్తం కామారెడ్డి పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించారు.

తమ భూములను ఇచ్చేది లేదని 8 గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ల వద్ద ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల ఆందోళనలు తీవ్రతరం చేశారు.

జనవరి 20 లోపు విలీన గ్రామాల పరిధిలోని కౌన్సిలర్లు రాజీనామా చేయాలని ..లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని రైతులు అల్టిమేటం జారీ చేశారు.

రైతులకు మద్దతుగా విపక్ష పార్టీల కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో మిగిలిన కౌన్సిలర్ల పైనా ఒత్తిడి పెరిగింది.

ఈ క్రమంలో సమావేశమైన మాస్టర్ ప్లాన్ ముసాయిదా ను రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానించింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/