Home / అంతర్జాతీయం
చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి ఊపందుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐ - ఫోన్ప్యాక్టరీ చుట్టుపక్కల లాక్డౌన్ విధించారు అధికారులు. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు. అధికారులు కఠిమైన నిబంధనలు అమలు చేస్తారన్న ఆందోళనతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఉత్తర కొరియా మరోసారి దక్షిణ కొరియాను రెచ్చగొట్టింది. ఏకంగా 17 క్షిపణులను దక్షిణ కొరియా సముద్ర జలాల్లో ప్రయోగించింది.
ట్విట్టర్లోని ఓ కీలక పదవిని చేపట్టేందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి మస్క్ అవకాశం కల్పించారు. భారతీయ అమెరికన్ అయిన శ్రీరామ్ కృష్ణన్ను ట్విటర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా నియమిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
డబ్బులు ఊరికే రావు అన్న మాటను ఇప్పుడు మస్క కూడా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇకపై ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉచితం కాదు. బ్లూ టిక్ పొందడం కోసం నెలకు 8 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.660 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ కొత్త సీఈవో ఎలాన్ మస్క్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
నేపాల్ దేశంలో ఈ నెల 20న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలో తమ తమ అభ్యర్ధులతో పోటీకి సై అంటున్నారు. ఈ క్రమంలో వందేళ్ల ఓ వృద్దుడు కూడా ఎన్నికల పోటీలో నిలబడి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో మధ్యప్రాచ్యదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బాబా వంగా, బల్లేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాల్లో నిజమైంది.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో హాలోవీన్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను క్రైస్తవులు వారి పూర్వీకులను స్మరించుకుంటూ జరుపుకుంటారు. హాలోవీన్ సందర్భంగా భయానక దుస్తులు ధరించడం, గుమ్మడికాయలు చెక్కడం, భయానక కథలు చెప్పడం, భయానక చలనచిత్రాలు చూడటం మరియు అనేక కార్యకలాపాలు చేస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల చనిపోయినవారు తమను గుర్తుపట్టకుండా ఉంటారని వారు విశ్వసిస్తారు. నిజానికి హలోవిన్ సంహైన్ యొక్క పురాతన సెల్టిక్ పండుగ. హాలోవీన్ను పంట కాలం ముగింపుగా జరుపుకుంటారు. మరియు సెల్టిక్ క్యాలెండర్ ప్రకారం, వారి సంవత్సరంలో మొదటి రోజు నవంబర్ 1దానికి గుర్తుగా మనం జనవరి 1నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటామో వారు హలోవిన్ ను అలా జరుపుకుంటారు.
ఫ్లోరిడాలో కమ్యూనిస్ట్ నేత సీపీఐ కార్యదర్శి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మియామి విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకొనింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో ఆయన్ను మూడు గంటల పాటు వేధించారు.
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12లో భాగంగా బుధవారం నవంబర్ 2న బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆడిలైడ్ వేదికగా రేపు మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లా కెప్టెన్ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.