Home / అంతర్జాతీయం
కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం శనివారం, మే 6న జరగనుంది. కింగ్ చార్లెస్ గత ఏడాది సెప్టెంబర్ 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్ IIమరణం తర్వాత సింహాసనాన్ని అధిష్టించారు.. పట్టాభిషేక వారాంతంలో ఊరేగింపులతో సహా దేశవ్యాప్త వేడుకలు నిర్వహించబడతాయి.
అమెరికాలోని ఒక మార్చురీలో పనిచేసే మహిళ, ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తికి 20 బాక్సుల మానవ శరీర భాగాలను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కాన్సాస్కు చెందిన కాండేస్ చాప్మన్ స్కాట్, ఒక మెడికల్ స్కూల్ నుండి పుర్రె, ఎముకలు మరియు దంతాలను దొంగిలించి, వాటిని పెన్సిల్వేనియా వ్యక్తికి $11,000కి విక్రయించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
చైనాలో పెరుగుతున్న నిరుద్యోగిత రేటు దేశానికి ఒక ముఖ్యమైన ఆర్థిక సవాలుగా మారుతోంది. చైనా యొక్క అత్యంత సంపన్న ప్రావిన్స్ మరియు తయారీ దిగ్గజం గ్వాంగ్డాంగ్, 300,000 మంది నిరుద్యోగ యువతను ఉపాధి కోసం రెండు మూడు సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాలకు పంపాలని ప్రతిపాదించింది.
సిరియాలోని ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని టర్కీ దళాలు నిర్వహించిన దాడుల్లో ఐఎస్ చీఫ్ హతమైనట్టు తాజాగా టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం వెల్లడించారు
థాయ్లాండ్లో చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చికోటి ప్రవీణ్ పట్టుబడ్డాడు. థాయ్లాండ్ పోలీసుల అదుపులో చికోటి, మాధవ్రెడ్డి, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి ఉన్నారు.
స్పెర్మ్ డొనేషన్ల ద్వారా 500 నుండి 600 మంది పిల్లలకు తండ్రయిన వ్యక్తిని డచ్ న్యాయమూర్తులు దానం చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. జోనాథన్ (41)గా గుర్తించబడిన వ్యక్తి మళ్లీ విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తే రూ. 90,41,657 జరిమానా విధిస్తామని చెప్పారు.
అమెరికాలోని టెక్సాస్ లో ఒక వ్యక్తిని కొందరు తన పెరట్లో కాల్పులు జరపడం ఆపమని కోరడంతో వారిని చంపాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి రైఫిల్తో పక్కింటికి వెళ్లి 8 ఏళ్ల బాలుడితో సహా అతని పొరుగువారిలో ఐదుగురిని కాల్చి చంపాడు.
7 దశాబ్దాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్ -2 గత ఏడాది సెప్టెంబర్ లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్ -3 బాధ్యతలు
నెక్రోఫిలియా.. చనిపోయిన వారితో సెక్స్ చేయడంలో లైంగిక ఆనందాన్ని పొందడం.. ఇటువంటి కేసులు పాకిస్తాన్ లో ఇటీవల కాలలో పెరిగిపోయాయి. దీనితో కుటుంబ పెద్దలు చనిపోయిన తమ కుమార్తెల లేదా ఇతర మహిళల సమాధులకు తాళాలు వేయడం ప్రారంభించారు.
గురువారం తూర్పు బుర్కినా ఫాసోలో సైనికుల బృందంపై అనుమానిత జిహాదీలు దాడి చేయడంతో 33 మంది సైనికులు మరణించగా 12 మంది గాయపడినట్లు సైన్యం తెలిపింది.గాయపడిన సైనికులను సురక్షితంగా తరలించామని, వారికి వైద్యసేవలు అందిస్తున్నామని ప్రకటించింది.