Home / అంతర్జాతీయం
టెస్లా యొక్క గిగా టెక్సాస్ కర్మాగారంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఒక రోబో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీర్ కొత్తగా వేసిన అల్యూమినియం ముక్కల నుండి కారు భాగాలను కత్తిరించే పనిలో ఉన్న రోబోలను పర్యవేక్షించడానికి సాఫ్ట్వేర్ను కోడింగ్ చేస్తున్నాడు.
ఉత్తర మధ్య లైబీరియాలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో కనీసం 40 మంది మరణించారని ఆ దేశ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ కాటే బుధవారం తెలిపారు.మంగళవారం రాజధాని మన్రోవియా నుండి 130 కి.మీ (80 మైళ్ళు ) దూరంలోని దిగువ బాంగ్ కంట్రీలోని టోటోటాలో ఇంధన ట్రక్కు కూలిపోయి పేలుడు సంభవించింది. దీనితో సంఘటనా స్థలానికి తరలివచ్చిన పలువురు మరణించగా మరికొంతమంది గాయపడ్డారు.
గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ నౌకాదళ అధికారుల కు ఖతర్ లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మరణశిక్షను రద్దు చేస్తూ వారికి ఊరట కల్పించింది. వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది.
కాంగోలోని కసాయి-సెంట్రల్ ప్రావిన్స్లో వరదలతో 22 మంది మరణించారు, అక్కడ కుండపోత వర్షాలు మౌలిక సదుపాయాలను నాశనం చేసి వరదలకు కారణమయ్యాయని కనంగా పట్టణ అధికారులు తెలిపారు.కొండచరియలు విరిగిపడటంతో ఇళ్ళు, చర్చిలు మరియు రోడ్లు ధ్వసం అయి పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 240 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్ ) సెంట్రల్ గాజాలో త మంగళవారం 100 ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిపింది.
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా పర్కాశ్ దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ సీటుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు.
సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై వరుస దాడుల్లో భాగంగా సాయుధ గ్రూపులు సుమారుగా 160 మందిని చంపినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు సోమవారం తెలిపారు. మొదట కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ తరువాత మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా క్రైస్తవులు డిసెంబర్ 25న జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు జరుపుకుంటారు. అయితే ఏసుక్రీస్తు పుట్టిన బెత్లెహామ్లో మాత్రం ఈ ఏడాది కళతప్పింది. ఎక్కడ క్రిస్మస్ ట్రీ, కానీ ప్రజల్లో సంతోషం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ సంవత్సరం ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం కారణంగా ఈ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు మరియు సావనీర్ దుకాణాలు నిర్మానుష్యంగా మారాయి.
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో చైనా యాజమాన్యంలోని నికెల్ ప్లాంట్లో సంభవించిన పేలుడు కారణంగా 13 మంది కార్మికుల మరణించగా పులువురు గాయపడినట్లు పోలీసులు మరియు తెలిపారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని పిలవబడే చైనా యొక్క ప్రతిష్టాత్మకమైన బహుళజాతి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇండోనేషియాలోని నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్లలో జరిగిన ఘోరమైన ప్రమాదాలలో ఇది తాజాది.
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.