Last Updated:

Nigeria: నైజీరియాలో సాయధ గ్రూపుల దాడిలో 160 మంది మృతి

సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై వరుస దాడుల్లో భాగంగా సాయుధ గ్రూపులు సుమారుగా 160 మందిని చంపినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు సోమవారం తెలిపారు. మొదట కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ తరువాత మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Nigeria: నైజీరియాలో సాయధ గ్రూపుల దాడిలో  160 మంది మృతి

Nigeria: సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై వరుస దాడుల్లో భాగంగా సాయుధ గ్రూపులు సుమారుగా 160 మందిని చంపినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు సోమవారం తెలిపారు. మొదట కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ తరువాత మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

300 మందికి పైగా గాయాలు..(Nigeria)

సోమవారం తెల్లవారుజాము వరకు సాగిన దాడుల్లో 160 మంది మరణించారని బోక్కోస్‌లోని స్థానిక ప్రభుత్వ అధిపతి సోమవారం కస్సా తెలిపారు. స్థానికంగా బందిపోట్లు అని పిలవబడే ముఠాలు 20 కంటే తక్కువ విభిన్న కమ్యూనిటీలలోదాడులను ప్రారంభించి ఇళ్లను తగలబెట్టాయని కస్సా చెప్పారు. ఈ సందర్బంగా 300 మందికి పైగా గాయపడగా వారిని వారిని బొక్కోస్, జోస్ మరియు బార్కిన్ లాడిలోని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర పార్లమెంటు సభ్యుడు డిక్సన్ చొలోమ్ దాడులను ఖండిస్తున్నామని, భద్రతా బలగాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఇటువంటి దాడులకు బెదిరిపోమని, న్యాయం మరియు శాశ్వత శాంతి కోసం  ఐక్యంగా పోరాడుతామని పేర్కొన్నారు.