Last Updated:

Guppedantha Manasu: రిషి చేతికి దెబ్బ తగలడంతో బోరున ఏడుస్తున్న వసుధార!

టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘గుప్పెడంత మనసు’. 2022 సెప్టెంబర్ 28 ఎపిసోడ్‌ హైలైట్స్ చూద్దాం.

Guppedantha Manasu: రిషి చేతికి దెబ్బ తగలడంతో బోరున ఏడుస్తున్న వసుధార!

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీన్లు ఏడిపించేశాయి. రిషి వసు కోసం కారులో బయలుదేరి వెళతాడు.అప్పుడు వసు ఓ గుడిలో అమ్మవారి ప్రాదేయ పడుతూ ఉంటుంది. రిషి వ్యక్తిత్వం గురించి జగతీ ఆవేదన అన్ని తలుచుకుని ఏడుస్తూనే అమ్మవారికి మొక్కుతూ తన బాధలను చెప్పుకుంటుంది. అప్పుడే వసు, అమ్మా నువ్వే తీర్పు చెప్పాలి ‘నా కోరిక సరైనదే కదమ్మా, నా కొరికలో ఏమి తప్పుంది అమ్మా, జగతీ మేడమ్‌ని రిషి సార్ అమ్మా అని పిలవాలని కోరుకోవడం నేను చేసినా తప్పా అని అనుకుంటూ ఉండగా, అప్పుడే వచ్చిన రిషి,‘తప్పే.. ముప్పాటికీ తప్పే’ అని అంటాడు. ‘ఏంటి సార్ అమ్మని అమ్మా అని పిలవడం మీకు అంత ఇబ్బందా సార్? ఎందుకు సార్ మీరు ఇలా ఆలోచిస్తారని అంటుంది వసు.

రిషి చేతికి దెబ్బ తగలడంతో బోరున ఏడుస్తున్న వసుధార

‘సార్ మీరు నన్ను బలవంతంగా మరిచిపో అన్నా నేను మరిచిపోలేను సార్. మీరు ఇది పంతం అనుకున్నా నాకు ఏ బాధ లేదు. అన్ని మంచి లక్షణాలు ఉన్న మీకు, కన్న తల్లిని అమ్మా అని పిలవలేని చెడ్డ లక్షణం మీకు ఉండకూడదనే నా బాధ సార్. మిమ్మలని అందరూ తప్పుగా అనుకోకూడదు సార్ అని గట్టిగా అరిచి చెబుతుంది. ఇంక ‘ఆపుతావా’ అంటూ పైనున్న గంటను గట్టిగా కొట్టడంతో రిషి చేతికి దెబ్బ తగులుతుంది. అప్పుడు వసు వెంటనే రిషి చేయి పట్టుకుని సార్ ‘రక్తం వస్తోంది సార్’ అంటూ వసు ఏడుస్తూ ఉండగా రిషి, చేతిని వెనక్కి లాక్కుంటాడు. వసుకు మాత్రం కన్నీరు ఆగవు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ  చదవండి: సెప్టెంబర్ 28 ఏపిసోడులో మోనితకు దెబ్బ గట్టిగానే తగిలినట్టు ఉంది !

ఇవి కూడా చదవండి: