Home / క్రైమ్
సాధారణంగా ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మహాయితే ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే ఒక వారం రోజు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ ఫ్యామిలీ మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా ఏడాదిన్నర కాలం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుకుంది.
అధికార పార్టీ నేతల వరుస హత్యలు ఏపీలో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల ఏలూరులో వైసీపీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్య మరువకముందే అదే తరహాలో ప్రకాశం జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై ఓ వైసీపీ నేతను లారీతో ఢీకొట్టి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని చోటుచేసుకుంది.
కేవలం నాలుగు రోజుల్లోనే ఓ యువకుడి ఆ మాయలేడి నట్టేటా ముంచేసింది. మొదట తియ్యని మాటలతో యువకుడికి వలవేసింది. ఆపై మాటలు కాస్త వీడియోకాల్స్ దాకా వెళ్లాయి ఆపై మరికాస్త సృతిమించి యువకుడి చేత దుస్తులు విప్పించి న్యూడ్ వీడియో కాల్ చేయించింది ఆ యువతి..ఇంక అంతే ఆ వీడియోతో ఆ యువకుడి కొంప కొల్లేరయ్యింది. న్యూడ్ వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి వాటిని చూపించి డబ్బుల కోసం బెదిరించసాగింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన విశ్వనగరమైన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
ఇరాన్లోనూ హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. హిజాబ్ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ పోలీసుల దాడిలో గత శనివారం మృతి చెందింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతుంది. అయితే వీటిని అణచివేసేందుకు ఇరాన్ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అణచివేతలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 31 మంది మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్నఎన్జీనో సంస్థ వెల్లడించింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనలో సీబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. కొంతకాలంగా స్ధబ్దుగా ఉన్న సీబిఐ విచారణ తిరిగి ఊపందుకొనింది.
ఖమ్మం జిల్లాలోనే మరో ఇంజక్షన్ హత్య వెలుగు చూసింది. బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన వెలుగులోకి రావడం ఖమ్మం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.
ఉత్తరప్రదేశ్లో నేరాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని చెప్పవచ్చు. మొన్నామధ్య మైనర్ దళిత బాలికలైన అక్కాచెళ్లెల్లపై అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని మొరాదాబాద్ జిల్లా ఓ మైనర్ బాలికపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఆ బాలిక సృహలోకి వచ్చిన తర్వాత రక్తం కారుకుంటూ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ తన ఇంటికి చేరుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
హిందూపురం పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేస్తున్న రెవిన్యూ ఇన్స్ పెక్టర్ షఫీఉల్లా ఏసిబీ వలలో చిక్కారు. 15వేల లంచం తీసుకొంటూ ఏసిబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు
ఓ ఎలక్ట్రానిక్ షోరూంకి కన్నమేసిన రూ. 70 లక్షలకు పైగా విలువైన చరవాణీలను చోరీ చేశాడు.. కానీ అక్కడనున్న ల్యాప్టాప్లు కానీ మరే ఇతర వస్తువుల జోలికి కానీ అతడు వెళ్లకపోవడం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది.
ఖమ్మం జిల్లాలో ఇటీవలె లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తినే ఇంజెక్షన్ ఇచ్చి చంపిన ఘటన విధితమే. కాగా ఆ హత్యపై పోలీసులు దర్యాప్తు చెయ్యగా వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని వెల్లడయ్యింది. సొంత భార్యే అతన్ని హత్య చేయించిందని తేలింది.