Home / క్రైమ్
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగువారు చనిపోయారు. మృతులు తానా బోర్డులో సభ్యుడి కుటుంబ సభ్యులగా గుర్తించారు.
పరీక్షలో ఒక పదం తప్పు రాయడం వల్ల ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పదం తప్పరాస్తావా అంటూ ఒక దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా చితకబాదడం వల్ల తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా ఔరియాలో జరిగింది.
వైఎస్సాఆర్ జిల్లా చక్రాయపేటలో దొంగలు హల్ చల్ చేసారు. స్టేట్ బాంకు ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న ఓ దుకాణాన్ని లూటీ చేసేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు.
5వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు దామరగద్ద తహశీల్దారు వెంకటేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో చోటుచేసుకుంది.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.
హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకొన్న ఆయన పిటిషన్ ఏపి హైకోర్టు కొట్టివేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడుగా ఉన్న శివ శంకర రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి తగిన కారణాలు సరైనవిగా తమకు కనిపించడం లేదని న్యాయస్ధానం పేర్కొనింది
హిమాచల్ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కులులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఓ టెంపో ట్రావెలర్ ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దానితో 7 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్ కి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోతోంది అంటూ స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.