Kisan Vikas Patra Scheme: కేంద్రం తీసుకొచ్చిన సరికొత్త స్కీమ్.. ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలు!
Kisan Vikas Patra Scheme in post office Benefits: ప్రజల ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరచాలని పోస్టాఫీసులో స్మాల్ సేవింగ్ స్కీమ్గా దీనికి పరిచయం చేసింది. రైతుల నుంచి ఉద్యోగుల వరకు ఎవరైనా ఈ పొదుపు స్కీమ్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
కేంద్రం పోస్టాఫీసులో ఈ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్టాఫీసుల ద్వారా అందించే ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉండడంతో పాటు భద్రత కలిగిన ఆదాయ మార్గంగా పనిచేస్తుంది. ఎలాంటి రిస్క్ లేకపోవడంతో ఈ స్కీమ్పై ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం 7.50శాతం వడ్డీ రేటు చెల్లిస్తుంది.
ఈ పథకం ప్రారంభించిన తర్వాత పెట్టిన పెట్టుబడి 10ఏళ్లలోపు అనగా దాదాపు 9 ఏళ్ల 7నెలల వ్యవధిలో రెట్టింపు అవుతోంది. గతంలో 120 నెలలు ఉండగా.. 115 నెలల్లోనే రెట్టింపు అయ్యేలా చేశారు. ఇక ఇందులో మూడు రకాల సర్టిఫికెట్లు ఉంటాయి. అందులో సింగిల్ హోల్డింగ్ అనగా ఒకరి పేరు మీద, జాయింట్ ఏ.. ఇద్దరు కలిపి(ఇందులో అనుకోకుండా ఒకరు చనిపోతే మరోవ్యక్తి డబ్బులు తీసుకునేలా)., చివరగా జాయింట్ బీలో ఇద్దరు కూడా డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
అర్హతలు ఇవే..
- కిసాన్ వికాస్ పత్ర స్కీమ్కు 18 ఏళ్ల వయసు ఉన్న ఇండియన్స్ అర్హులు.
- మైనర్లు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై సంబంధింత పెద్దలు సర్టిఫికెట్ తీసుకునేందుకు అవకాశం ఉంది. సంరక్షణగా ఒకరు ఉంటారు.
- ఎన్ఆర్ఐలకు అవకాశం లేదు.
- ఈ స్కీమ్లో లక్ష పెట్టుబడి పెడితే 115 నెలల తర్వాత రెండు లక్షలు అవుతోంది.