Home /Author anantharao b
గుజరాత్లోని సూరత్ కోర్టు, గురువారం నాడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించింది, అతని "మోదీ ఇంటిపేరు" వ్యాఖ్యలపై అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అతిపెద్ద స్కాంకు పాల్పడ్డారని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ఆరోపణలపై కాపుసంక్షేమసేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. స్కాంలో చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని.. లేనిపక్షంలో జనసేన టిడిపితో కలిసే అవకాశాలు ఉండవన్నారు.
ఢిల్లీ బడ్జెట్ కి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రజలపై మీకు ఎందుకంత కోపం అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాసిని కొన్ని గంటల్లోనే ఢిల్లీ బడ్జెట్ కు ఆమోదం లభించడం విశేషం.
రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జాకీర్ నాయక్ను ఒమన్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. మార్చి 23న ఒమన్ పర్యటన సందర్భంగా నాయక్ను అదుపులోకి తీసుకునేందుకు భారత నిఘా సంస్థలు ఇప్పటికే ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
గత ఐదేళ్లలో దేశంలోని ఆరు పారామిలటరీ బలగాలకు చెందిన కనీసం 50,155 మంది సిబ్బంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. మార్చి 17న రాజ్యసభలో సమర్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది.
ఖలిస్తానీ నాయకుడు మరియు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ను పట్టుకునేందుకు చేపట్టిన వేట నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్ ) శ్రీలంక యొక్క దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో సహాయపడటానికి నాలుగు సంవత్సరాలలో దేశం కోసం దాదాపు $3 బిలియన్ల బెయిలౌట్ కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపిందని ఐఎంఎఫ్ సోమవారం ప్రకటించింది.
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమవుతున్నారు. తన ప్రియురాలు అయిన 65 ఏళ్ల యాన్ లెస్లీ స్మిత్ ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.
భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పేరును ఇంటర్పోల్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ. 13,000 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీని డిసెంబర్ 2018లో ఇంటర్పోల్ రెడ్ నోటీసులో చేర్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.దేశం యొక్క 75 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ నిలిపివేయబడింది