Home /Author anantharao b
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారతదేశానికి వచ్చారు. రాష్ట్రపతి భవన్ వెనుక ఉన్న బుద్ద జయంతి పార్కులో ఇద్దరు నేతలు కలిసి బుద్దునికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు భారతీయ స్నాక్స్ కొన్నింటిని రుచి చూసారు.
ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ఎటిఎమ్లు) రూ. 2,000 నోట్లను నింపడానికి లేదా నింపకూడదని బ్యాంకులకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాలను మెరుగుపరచడంలో భాగంగా పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసిఎంఆర్) H3N2 ఫ్లూ కేసులు మరియు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేసారు. బీజేపీ పై ఐక్యంగా పోరాడాలని రాష్ట్రంలోని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.ఉత్తర కర్ణాటకలోని బెలగావిలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
కేరళకు చెందిన ట్రాన్స్వుమన్ పద్మ లక్ష్మి రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసుకోవడంతో కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది అయ్యారు. కేరళ బార్ కౌన్సిల్లో చేరిన 1500 మంది లా గ్రాడ్యుయేట్లలో ఆమె ఒకరు.
ఫ్లోరిడా ప్రాథమిక తరగతుల్లో రుతుచక్రాలు మరియు ఇతర మానవ లైంగికత అంశాలపై చర్చలను నిషేధించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు మెజారిటీ ఓట్లతో ఆమోదం పొందుతుందని భావించారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన ప్రభుత్వం ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి తక్కువ-ఆదాయ ప్రజలకు సబ్సిడీపై పెట్రోల్ అందించనున్నట్లు ప్రకటించారు.లీటరుకు 50 రూపాయల సబ్సిడీని ఉపశమన ప్యాకేజీలో భాగంగా ఇవ్వనున్నారు.
మార్చి 17న ఒక పత్రికా ప్రకటనలో, రోల్స్ రాయిస్ మరియు యూకే స్పేస్ ఏజెన్సీ మైక్రో-రియాక్టర్ ప్రోగ్రామ్ చంద్రునిపై నివసించడానికి మరియు పని చేయడానికి మానవులకు అవసరమైన శక్తిని అందించే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని తెలిపారు.
బీహార్లోని పాట్నా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్లపై అడల్ట్ ఫిల్మ్ ప్లే చేయడంతో అక్కడి ప్రజలు షాక్కు గురయ్యారు. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్లోని టీవీ స్క్రీన్లపై ప్రకటనలకు బదులుగా అడల్ట్ ఫిల్మ్ ప్లే చేయడం ప్రారంభించడంతో కంగారు పడిన స్టేషన్లోని ప్రజలు ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి ఫిర్యాదు చేశారు.