Home /Author anantharao b
లండన్ లోని భారత హైకమిషన్ వద్ద ఆదివారం కిటికీని పగులగొట్టడంతో లండన్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అరెస్టు చేసారు. ఈ సందర్బంగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు స్వల్ప గాయాలయ్యాయి.సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోలో, లండన్లోని భారత హైకమిషన్లోని ఒక అధికారి ఖలిస్తానీ మద్దతుదారుడి నుండి త్రివర్ణ పతాకాన్ని రక్షించడం మరియు ఖలిస్తానీ జెండాను విసిరేయడం కనిపించింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసాన్ని సందర్శించిన కొన్ని గంటల తర్వాత ఆయన నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని సమర్పించారు. మరో 8-10 రోజులలో వివరంగా ప్రతిస్పందిస్తానని తెలిపారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు టిప్పు సుల్తాన్కు సంబంధించిన మరో అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. టిప్పు సుల్తాన్ హంతకులపై సినిమా నిర్మించేందుకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్సిసి)తో చర్చలు జరుపుతున్నట్లు అధికార బీజేపీ ప్రకటించింది
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)ని "నిషిద్ధ" సంస్థగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ అంతర్గత మంత్రి రానా సనువల్లా చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు విదేశీ బహుమతులు మరియు అలంకారాల చట్టం ప్రకారం విదేశీ ప్రభుత్వ అధికారుల నుండి అందుకున్న బహుమతులను బహిర్గతం చేయడంలో విఫలమయ్యారని యుఎస్ హౌస్ డెమోక్రాట్ల నివేదిక తెలిపింది.
ఆస్ట్రేలియాలోని మెనిండీలో మిలియన్ల కొద్దీ చనిపోయిన మరియు కుళ్ళిన చేపలు తీరానికి కొట్టుకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.న్యూ సౌత్ వేల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ ప్రకారం, వరదనీరు తగ్గుముఖం పట్టినప్పుడు ప్రాణవాయువు తక్కువగా ఉండటం వల్ల మరణాలు సంభవించి ఉండవచ్చు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ను తనిఖీ చేసి ప్రయాణికుల నుండి అభిప్రాయాన్ని తీసుకున్నారు.రైలులో ఉన్న వారితో తన ప వీడియోను పంచుకుంటూ, వైష్ణవ్ ఇలా రాసారు.
ఖలిస్తానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ ఇప్పటికీ పంజాబ్ పోలీసుల నుండి పరారీలో ఉన్నాడని మరియు అతని జాడ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత సాయంత్రం జలంధర్లో మోటార్సైకిల్పై వేగంగా వెళ్తున్న అమృతపాల్ సింగ్ను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు వర్గాలు చెబుతున్నాయి
బంగ్లాదేశ్లోని మదారిపూర్లోని షిబ్చార్ ఉపజిల్లాలోని కుతుబ్పూర్ ప్రాంతంలో ఢాకాకు వెళ్తున్న బస్సు పద్మ వంతెన వద్దకు వెళ్లే రహదారిపై నుండి ఒక కాలువలోకి దూసుకెళ్లడంతో కనీసం 17మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.
శనివారం దక్షిణ ఈక్వెడార్ మరియు ఉత్తర పెరూలో సంభవించిన బలమైన భూకంపంతో 15 మంది మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ఈక్వెడార్లోని రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్కు దక్షిణంగా 50 మైళ్ల (80 కిలోమీటర్లు) దూరంలో పసిఫిక్ తీరంలో కేంద్రీకృతమై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదించింది.