Home / Uncategorized
భారతదేశంలో ఫేస్ బుక్ కార్యకలాపాలను మూసివేయడానికి ఆదేశాలు జారీ చేస్తామంటూ కర్ణాటక హైకోర్టు ఫేస్బుక్కు హెచ్చరిక జారీ చేసింది. సౌదీ అరేబియాలో ఖైదు చేయబడిన భారతీయ పౌరుడి కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులకు ఫేస్బుక్ సహకరించడం లేదని ఆరోపించిన నేపధ్యంలో కోర్టు ఈ హెచ్చరిక జారీ చేసింది.
సోషల్ నెట్వర్కింగ్ సైట్ను మూసివేస్తామని భారతదేశం బెదిరించిందని పేర్కొన్న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీపై కేంద్రం ఎదురుదాడి చేసింది. 2021లో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సే, ప్రభుత్వాన్ని విమర్శించే ఖాతాలను, రైతుల నిరసనలపై నివేదించే వారి ఖాతాలను సెన్సార్ చేయమని, అలాగే ప్లాట్ఫారమ్ను మూసివేస్తామని భారతదేశం నుండి బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర మామిడి పండ్లను ప్రధాని నరేంద్ర మోదీ కి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారయింది. ఏపీలో ఈ నెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముందుగా అన్నవరంలో పూజలు చేసి యాత్రకు బయలుదేరనున్నారు.
:తనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 5న అయోధ్యలో జరగాల్సిన తన ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించడంతో ఈ ప్రకటన వెలువడింది.
మహారాష్ట్రలోని అకోలాలో శనివారం జరిగిన మత ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 103 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. శాంతి భద్రతలను కాపాడేందుకు గాను ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ బంద్ చేసారు.
తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల( Dost) నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచిందని, పరిస్థితి అవసరమైతే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మొత్తం ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని, ప్రస్తుత పాలసీ రేటు ఇప్పటికీ అనుకూలంగానే ఉందని ఆయన తెలియజేశారు.
గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా.. రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.