Home / టెక్నాలజీ
జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. "ప్లాట్ఫామ్" పేరుతో కొత్త యాప్ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.
ఒక సమాచారాన్ని షాట్ అండ్ స్వీట్ గా ప్రజలకు తెలియజేసే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దిగ్గజ సంస్థగా ట్విట్టర్ కు మంచి పాప్యులారిటీ ఉంది. అలాంటి ట్విట్టర్లో ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది.
మరోసారి మస్క్ నెట్టింట వైరల్ గా మారారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఈ రెండు కంపెనీలు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విటర్ను తొలిగిస్తే గనుక యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా తాను ప్రత్యామ్నాయంగా మొబైల్స్ తయారీలోకి ప్రవేశిస్తానని అన్నారు.
వాట్సాప్ యూజర్లకు షాక్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయి. ఓ వ్యక్తి వాటిని హ్యాక్ చేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్టు ‘సైబర్న్యూస్’ వెల్లడించింది.
ఒకరిపై మరొకరు పరువునష్టం దావాతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన జంట హాలీవుడ్ తార అంబర్ హెర్డ్, నటుడు జానీ డెప్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది వీరి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారట.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది.
ట్విట్టర్ కంపెనీల కోసం "గోల్డ్ చెక్", ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగు మరియు వ్యక్తుల కోసం నీలం రంగును ప్రవేశపెడుతుందని మస్క్ చెప్పారు.
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ 'బిస్లరీ'ని అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు.
ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను చేపట్టాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ కూడా భారత్ లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొంత మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది.
శామ్ సంగ్ ఎట్టకేలకు బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రకటించింది. శామ్ సంగ్ తన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్ పై డిస్కౌంట్స్ ను ఆఫర్ చేయనుంది. ఈ సేల్ ఈ నెల 24 నుంచి 28 వరకు కొనసాగుతుంది.