Home / Telangana News
స్వాతంత్రదినోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మహానీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు.
నాగార్జున సాగర్కు వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు అన్నీ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 4 లక్షల 14 వేల 14 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4 లక్షల 22 వేల 292 క్యూసెక్కులుగా ఉంది.
రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్టర్లో తన చిన్న నాటి జ్జాపకాలను పంచుకున్నారు. కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ చెల్లెలు కవితతో ఉన్న ఫొటోతో పాటు కూతురు అలేఖ్య, హిమన్షు ల పిక్స్ షేర్ చేస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రాయితీలు ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టే శిశువులు, వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ గురకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. సాయంత్రం స్నాక్స్ తిన్న తరువాత 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో 14మంది విద్యార్థుల
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది.
శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుసింది. లంగర్హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లిలో వర్షం కురిసింది. కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ వార్డును ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు