Home / Revanth Reddy
: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకువెడుతోంది. ఈ నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
రైతుబంధు నిలిపివేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు
కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఈడీ, ఐటి దాడులపై తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని రేవంత్ రెడ్డి బిఆర్ఎస్- బిజెపిని హెచ్చరించారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? అని కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. బుధవారం కొడంగల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీకి రూ.50 లక్షలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తీరును గుర్తు చేశారు. జైలుకు వెళ్లినా రేవంత్ రెడ్డిలో మార్పు రాలేదని కేసీఆర్ అన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద లో మైనార్టీ డిక్లరేషన్ను విడుదల చేసారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్ కింద సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తామన్నారు.
రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా
తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో సహా చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు