Home / Rahul Gandhi
భారత్ను ఏకం చేయడం లక్ష్యంగా భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగుతున్నారు. రాహుల్ గాంధీ, తోటి పాదయాత్రికుల సంభాషణ యొక్క సంగ్రహావలోకనం భారత్ జోడో యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియోలో షేర్ చేయబడింది.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించిన మరుసటి రోజు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కుదిరితే అమరావతి రైతుల పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానన్నారు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నభారత్ జోడో యాత్ర మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది.
రెండు దశాబ్ధాల అనంతరం పార్టీలో ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. పార్టీలోని ప్రతినిధులు నేరుగా తమ ఓటు హక్కుతో అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
22 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి (ఏఐసిసి) ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ప్రతినిధులు 9308మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపటిదినం ఆయా రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో డెలిగేట్స్ ఓటు వేయనున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. నేడు ఏపీలోకి ఈ యాత్ర ప్రవేశించింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో నేడు మొదలైన రాహుల్ పాదయాత్ర ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది.
దేశంలోనే అత్యంత అవినీతిమయమైన కర్ణాటక ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కర్ణాటక సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ పెట్టుబడులపై హుందాగా మాట్లాడారు. తాను కార్పొరేట్లకు కాదు, కేవలం గుత్తాధిపత్యం చేస్తున్న వ్యవస్ధలకు మాత్రమే తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వ్యాపార దిగ్గజం అదానీ రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు
నేరుగా చెబితే రాజకీయం అంటారు. దాన్నే ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెబితే రాజకీయ చాణుక్యుడు అంటారు. ఇదే తీరును రాహుల్ గాంధీ కర్ణాటకలో తన భారత్ జోడో యాత్రలో కనపరిచాడు. దీని ద్వారా ఓ ప్రాణికి సకాలంలో వైద్య సేవలు అందేలా చేశాడు. ఇదంతా సోషల్ మీడియా పవర్ గా చెప్పాల్సిందే..