Home / national news
తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 15 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోనే ఉన్నాయి. తిరుచ్చి, నామక్కల్, సేలం జిల్లాల్లో వరదలు ప్రమాదకరస్థాయిని తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
నేడు భారత 16 వ ఉపరాష్ట్ర పతి ఎన్నికల కోసం పార్లమెంట్ భవనంలో ఏర్పాట్లు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా మాజీ పశ్చిమ భెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ బరిలో నిలవగా.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మార్గరేట్ ఆల్వా బరిలో ఉన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ హాల్ లోనే కౌంటింగ్ జరుగుతుంది.
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శతాబ్దం క్రితం ఒక్కో ఇటుక పేర్చుకుంటూ భారత్ను నిర్మించుకుంటే ప్రస్తుతం మన కళ్ల ముందే ప్రజాస్వామ్యం నాశనంమవుతోందని
కేరళలో వరుసగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని దక్షిణ జిల్లాలో వర్షాలు కాస్తా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాతావరణశాఖ ఈ రోజు ఎనిమిది జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఇదుక్కి, త్రిసూర్, పలక్కాడ్, మల్లాపురం, కోజికోడ్, వానియాడ్,
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పలువురు విదేశీయులు భారత్ కు వచ్చారు.అయితే వీసాల గడువు ముగిసినప్పటికీ 40,000 మందికి పైగా విదేశీయులు భారతదేశంలోనే ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2019లో వీసాల గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 54,576
రాజస్థాన్లోని తొమ్మిది జిల్లాల్లో లుంపి చర్మవ్యాధి కారణంగా 2,500 పైగా పశువులు మరణించడంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. వైరల్ వ్యాధి కారణంగా 2,500 పశువులు చనిపోగా, మరో 50,000 పశువులకు సోకింది. వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పటికే తొమ్మిది జిల్లాలకు వ్యాపించింది.
తాను నరేంద్ర మోదీకి భయపడనని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యను చూసి భయపడబోనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ చర్యలను "బెదిరింపు ప్రయత్నం"గా ఆయన అభివర్ణించారు."దేశాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు దేశంలో సామరస్యాన్ని కొనసాగించడానికి నేను పని చేస్తూనే ఉంటాను.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. మంగళవారం నుంచి దిల్లీ, లఖ్నవూ, కోల్కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్కు చెందిన హెరాల్డ్ హౌస్లోని యంగ్ ఇండియన్ ఆఫీస్ను సీజ్
పశ్చిమ బెంగాల్ లో కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కేబినెట్లో యువరక్తాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కెబినెట్ను విస్తరించారు. మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు అవకాశం కల్పించారు. కేబినెట్ మార్పులు చేర్పుల్లో కొత్తగా ఆరుగురిని కేబినెట్లోకి తీసుకున్నారు.
సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేషనల్ హెరాల్డ్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ పేపర్తో పాటు మొత్తం 12 లొకేషన్లలో సోదాలు మొదలుపెట్టింది.