Home / Mumbai
దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఈ ఏడాది ముంబై నిలిచింది. ఇక ఆసియాలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో నిలిస్తే.. ఢిల్లీ 30వ స్థానాన్ని ఆక్రమించింది. 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేను హెచ్ఆర్ కన్సెల్టెన్సీ సంస్థ మెర్సర్ నిర్వహించింది.
దేశవ్యాప్తంగా ఐదవ విడత లోకసభ పోలింగ్ జరుగుతోంది. ముంబైలో పోలింగ్ సందర్బంగా బాలీవుడ్ ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో హ్రితిక్ రోషన్ ఆయన కుటుంబసభ్యులున్నారు. ఓటు వేసి వచ్చిన తర్వాత ఆయన కొంత సేపు మీడియాతో ముచ్చటించారు
: ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ లు నడపనున్నారు .ఆంధ్ర ప్రాంతం నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ప్రతి రోజు చాలా మంది వ్యాపార నిమిత్తం ,ఇతర కార్యక్రమాలకు వెళ్తూ వుంటారు .
ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.
Worlds Richest Beggar: బిచ్చగాళ్లే కదా అని చులకనగా చూడకండి వారిలోనూ కోటీశ్వరులు ఉంటారు అన్న మాట వినే ఉంటాం. వినడమే కాదండోయ్ ఈ మధ్య వచ్చిన బిచ్చగాడు సినిమా ద్వారా చూశాము కూడా. పరిస్థితులు ఏమైనా కావచ్చు కొందరు బిక్షాటన చేయడాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తుంటారు.
కోవిడ్ సెంటర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ముంబై మరియు సమీప ప్రాంతాలలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.పరిశీలనలో ఉన్న సంస్థ లైఫ్లైన్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్, శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్తో సంబంధం కలిగి ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్.. రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. ఏ దశలోనూ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి తగల్లేదు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన ట్రేడింగ్ రోజంతా ఓ పరిమిత శ్రేణిలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు రానుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
ముంబైలో 56 ఏళ్ల వ్యక్తి సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శరీర భాగాలను కట్టర్తో ముక్కలుగా చేసి, ఆపై కుక్కర్లో శరీర భాగాలను ఉడకబెట్టాడు. ముంబైలోని మీరా రోడ్లో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.