Home / latest national news
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తమ నిరసన రాజకీయ ప్రేరేపితమైనది కాదని రెజ్లర్ సాక్షి మాలిక్ మరియు ఆమె భర్త సత్యవర్త్ కడియన్ చేసిన ప్రకటనపై మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ ఆదివారం నాడు మండిపడ్డారు. వారు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారారని కూడా ఆమె ఆరోపించారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమయింది. వరోవైపు సినిమాలోని కొన్ని డైలాగులు వివాదానికి దారి తీసాయి. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న భారీ ఆగ్రహానికి ప్రతిస్పందించిన మేకర్స్, ప్రేక్షకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని డైలాగ్లను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలోని ఆర్ కె పురం అంబేద్కర్ బస్తీ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వారిని అర్జున్ మరియు మైఖేల్గా గుర్తించారు. బాధితుల సోదరుడితో వారికి ఆర్థిక వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో అల్లాడిపోతోంది. వడదెబ్బ కారణంగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో98 మంది మరణించారు. యూపీలో 54 మంది చనిపోగా, బీహార్లో గత మూడు రోజుల్లో 44 మంది మరణించారు.
Manipur Violence: మణిపూర్లో కొద్దిరోజులుగా అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ నిరసన కార్యక్రమాలు మరింత హింసాత్మకంగా మారాయి. దీనితో ఆ రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుంది.
జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న జుమాగండ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్ కు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. విల్లుపురం కోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి పది వేల జరిమానా కూడా కోర్టు విధించింది.
విడుదలకి ముందే సినిమా పాత్రల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ సినిమా ఇప్పుడు న్యాయ పరమైన వివాదాల్లో చిక్కుకుంది. ఆదిపురుష్ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు ఈ పిల్ దాఖలు చేశారు.
బిపర్ జోయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం మరియు గంటకు 115-125 కిలోమీటర్ల (కిమీ) వేగంతో గాలులు వీచాయి. వీటి ప్రభావంతో వందలాది చెట్లు కూలిపోయాయి, కమ్యూనికేషన్ టవర్లు దెబ్బతిని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాదానికి రూ.10 కోట్లు ఆఫర్ చేశాడు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు రాసిన లేఖలో చంద్రశేఖర్ విరాళం ఇవ్వడానికి అనుమతిని కోరాడు, ఆ మొత్తాన్ని తన సక్రమమైన మరియు పన్ను విధించిన ఆదాయం అని పేర్కొన్నాడు.