Home / latest national news
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం స్థానిక కోర్టులో సమర్పించిన దర్యాప్తుపై తమ స్టేటస్ నివేదికలో తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్లోని గాంధీనగర్లో 4,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు 19,000 మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు ఒకరోజు పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ సహా 68 మంది గుజరాత్ లోయర్ జ్యుడీషియల్ ఆఫీసర్లకు పదోన్నతిపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.
ఐదు నుంచి ఏడు లగ్జరీ కార్లు, 20,000 చదరపు అడుగుల స్థలం, బహుమతి పొందిన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులు మరియు రూ.30 లక్షల విలువైన టీవీతో సహా ఇరవై వాహనాలు ఇవన్నీ నెలకు కేవలం రూ. 30,000 జీతం సంపాదించే ప్రభుత్వ ఉద్యోగివి. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అవినీతి శాఖ దాడిలో ఇవి బయట పడ్డాయి.
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత సీఎం స్టాలిన్ మొదటిసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ సందర్బంగాస్టాలిన్ ప్రభుత్వంలో గత రెండేళ్లుగా ఆర్దికమంత్రిగా ఉన్న త్యాగరాజన్ ను ఐటీ మంత్రిత్వశాఖ కు మార్చారు. పీటీఆర్ అని కూడా పిలువబడే పళనివేల్ త్యాగ రాజన్ గత రెండేళ్లుగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
1994లో జరిగిన ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్యకేసులో తాను నిర్దోషినని మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ అన్నారు. తాను దోషి అని ప్రభుత్వం భావిస్తే ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
రైల్వే శాఖ తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అగ్నివీర్లకు నాన్-గెజిటెడ్ పోస్టులలో 15 శాతం రిజర్వేషన్ను అందిస్తుంది. వారికి వయస్సు సడలింపు మరియు ఫిట్నెస్ పరీక్షల నుండి మినహాయింపును కూడా అందజేస్తుందని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి.
పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వరుస పేలుళ్లలతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. కాగా తాజాగా గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్కడి స్థానికి ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. లంగర్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీగురు రామ్ దాస్ జీ సరాయ్ వద్ద బుధవారం అర్థరాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఢిల్లీలో పని చేస్తున్న రోజువారీ కూలీ అయిన రవీందర్ కుమార్కి ప్రతి రాత్రి చిన్న పిల్లల కోసం గంటల తరబడి వేటాడటం దినచర్యగా మారింది. వారిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన తరువాత చంపేసే వాడు. ఇటువంటి వారిని గుర్తిండానికి అతను ఢిల్లీలోని మురికివాడల గుండా మైళ్ళ దూరం నడిచేవాడు.
ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ స్ఫష్టం చేసారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడిఎస్తో పొత్తుకు అవకాశాలు లేవు. మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 130-135 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికూర్జున్ ఖర్గే కూడా ప్రకటించారు.