Home / latest national news
: ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ (PM CARES ఫండ్) గత మూడేళ్లలో విదేశీ విరాళాలుగా రూ. 535.44 కోట్లు అందుకుంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో PM CARES ఫండ్ 2020లో ఏర్పాటు చేయబడింది.
మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడంపై సుప్రీంకోర్టు సోమవారం బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఆనంద్ మోహన్, బీహార్ జైలు నిబంధనల సవరణతో గత నెలలో సహర్సా జైలు నుంచి బయటకు వచ్చారు.
కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదు అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్బంగా శనివారం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.
మణిపుర్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ద్వారా మణిపుర్ రాజధాని ఇంఫాల్ నుంచి విద్యార్థులను శంషాబాద్ తీసుకొచ్చారు.
రిజర్వేషన్ల కారణంగా హింసాత్మక ఘటనలు రేగిన మణిపూర్ నుండి వందలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రయాణీకుల డిమాండ్ పెరిగిపోవడంతో ఇండిగో మరియు ఎయిర్ ఏషియాతో సహా పలు విమానయాన సంస్థలు తమ ఛార్జీలను పెంచాయి.
ఛత్తీస్గఢ్లోని సుక్మాలో డీఆర్జీ జవాన్లు, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
మణిపూర్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తరలించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు హెల్ప్లైన్లను ఏర్పాటు చేశాయి. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ, తెలంగాణ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు.
‘ది కేరళ స్టోరీ’ ( The Kerala Story Movie ) సినిమాపై వాహకిన వివాదాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మే 5న విడుదల అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కేరళలో అధికార, పలు విపక్ష పార్టీలు ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో మండిపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ముఖ్యమంత్రి పినరయి విజయన్
: మణిపూర్లో చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. , అయితే రెండు రోజుల హింసాకాండ తరువాత, కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి. అయినప్పటికీ సాయుధ దళాల పహరా కొనసాగుతోంది.
ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమక్షంలో సూచించారు