Home / latest crime news
దేవీనవరాత్రుల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తూ ఆ ప్రాంతవాసులు జగన్మాతను ఆరాధిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఓ యువకుడు డాన్స్ చేస్తూ గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయాడు. దీనితో శరన్నవరాత్రి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సాయి అనే ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చిలకలూరిపేటలో చోటుచేసుకుంది.
దుర్గామాత పూజలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని భదోహిలో చోటుచేసుకుంది.
ఈత సరదా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల తాడిపర్తి గ్రామంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మరణించారు.
లోన్ యాప్స్ వేధింపులకు ఏపీలోని మరో ప్రాణం బలయ్యింది. మైక్రో ఫైనాన్స్ మరియు లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. దీనితో చేసేదేం లేక ఇప్పటికే చాలామంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో లోన్యాప్ అరాచకానికి మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు.
ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
నేటి తరం అబ్బాయిలకు ఒకసారే పెళ్లి కావకడమే కష్టం అంటే ఈ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదికూడా 28ఏళ్ల వయస్సులోనే అది ఎలా సాధ్యం అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట ఒకే ఏడాదిలో వరుసగా రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. గత కొద్దినెలల క్రితం అన్నయ్య రమేష్ బాబు మరణించగా, 28 సెప్టెంబర్ 2022 బుధవారం ఉదయం తల్లి ఇందిరా దేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది.
జమ్ముకశ్మీర్లోని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ అనుమానాస్పద బ్లాస్ట్ లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఉధంపూర్లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిపై అధికారులు ఆరా తీరుస్తున్నారు.
వారిరువు వరుసకు అన్నా చెల్లెళ్లు. ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే. పాఠశాలకు వెళ్లివస్తోన్న క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దానితో బాలిక గర్భం దాల్చింది. తీరా చూస్తే ఏడునెలల గర్బం అని తెలిసి భయపడి పారిపోయి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ ఉదతం బిహార్లో చోటుచేసుకుంది.