Home / latest crime news
పరీక్షలో ఒక పదం తప్పు రాయడం వల్ల ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పదం తప్పరాస్తావా అంటూ ఒక దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా చితకబాదడం వల్ల తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా ఔరియాలో జరిగింది.
హిమాచల్ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కులులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఓ టెంపో ట్రావెలర్ ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దానితో 7 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్ కి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోతోంది అంటూ స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరటోయా నదిలో ఓ పడవ బోల్తా పడటంతో 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయ్యారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. వివాహితపై సామూహిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాత్రూమ్లో 19 ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో తీశారు. ఆ క్లిప్ను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. తీరా చూస్తే అసలు విషయం తెలుసుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులకు నిందితుల్లో ఒకరు చిక్కారు, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది.
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు కవల పిల్లలు మరణించారు.
విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులు ఏమన్నా పడే రోజులు పోయాయ్. ఒకప్పుడు బెత్తంతో భయం చెప్పినా కిక్కురుమనకుండా విద్యనభ్యసించడం చూశాం కానీ ఇప్పుటి కాలం విద్యార్థులైతే అందుకు భిన్నంలెండి. తరగతి విద్యార్థుల ముందు టీచర్ తిట్టాడని నామోషీగా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఆ కోపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై కాల్పులు తెగబడ్డాడు. నాటు తుపాకీతో టీచర్ను వెంబడించిన మరీ ఏకంగా మూడు రౌండ్లు కాల్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
సాధారణంగా ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మహాయితే ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే ఒక వారం రోజు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ ఫ్యామిలీ మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా ఏడాదిన్నర కాలం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుకుంది.