Home / International News
ఈ ఏడాది బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు విపరీతమైన ఎండలు కాస్తాయని తాజాగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంగ్లండ్లో పాటు వెల్స్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చునని హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు యావత్ ప్రపంచం అల్లాడినా, ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇటీవల అక్కడ కూడా వైరస్ విజృంభించిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే లక్షల మంది ప్రజలు జ్వరం బారినపడ్డారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాత్కాలికంగా నివసించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం సింగపూర్లో ఉంటున్న రాజపక్స వీసా నేటితో ముగిసిపోతుంది. కాబట్టి సింగపూర్ నుంచి వేరే ఇతర దేశానికి మకాం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమరానికి సై అంటోంది తైవాన్. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అడుగు పెట్టిన వెంటనే చైనా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. చెప్పిన ప్రకారమే తైవాన్ తీర ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ మొదలుపెట్టింది. కయ్యానికి కాలు దువ్వింది. తైపీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించింది.
అప్గానిస్తాన్లో తాలిబన్లు పగ్గాలు చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రజల జీవితాలు మరింత దుర్భంగా మారిపోయాయి. మహిళలపై సరికొత్త ఆంక్షలు విధించడంతో ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. బాలికల చదువుపై ఆంక్షలు విధించడంతో పాటు స్కూళ్లను ధ్వంసం చేయడంతో చదువు
శ్రీలంక ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. పెట్రోల్ కొరత, ఆహార కొరత, విద్యుత్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు తాజాగా శ్రీలంక ప్రజల నెత్తిన కరెంటు చార్జీలు పిడుగు పడింది. సిలోన్ ఎలక్ర్టిసిటి బోర్డు విద్యుత్ టారిఫ్ను ఏకంగా 264 శాతం పెంచేసింది.
బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధరలు ఏకంగా 50 శాతం పెంచేసింది ప్రభుత్వం.దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడంతో భారత్ తో పాటు శ్రీలంకలో కూడా ఇటీవల భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చూశాం.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. భారీ వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లపై కార్లు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్లో ఎఫ్బీఐ సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను ఇక్కడికి తరలించారేమో అనే అనుమానంతో సోదాలు చేశారు. అయితే, వీటిని అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్లో పర్యటించినందుకుగానూ ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ తైవాన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం నిరసన వ్యక్తం చేసింది.