Home / International News
జర్మనీకి చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ లుఫ్తాన్సా కు సమ్మె సెగ తగిలింది. వేతనాలు పెంపు, సెలవుల విధానం కోరుతూ సంస్థకు చెందిన పైలట్లు ఈ రోజు నుంచి సమ్మెకు దిగడంతో లుఫ్తాన్సా 800 విమానాలు రద్దు చేసింది.
ఆఫ్గనిస్తాన్ హెరాత్లోని గుజార్గా మసీదులో శుక్రవారం జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రముఖ మతపెద్ద ముజీబ్-ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు
ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబానికి వారి బ్యాంక్ అక్కౌంటులో పొరపాటున $100కి బదులుగా $10.4 మిలియన్లు జమకావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీనితో ఇపుడు వారు ఖర్చు చేసిన ప్రతి పైసాను తిరిగి చెల్లించాలి.
పాకిస్థాన్లో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలతో ముంచేసింది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతాల్లో వరదలు వల్ల అన్ని మునిగిపోయాయి. వరదల వల్ల వెయ్యికి పైగా మృతి చెందగా మూడు కోట్ల మంది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. జులై నుంచి పాక్ లో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సింధ్ , బలోచిస్థాన్ , ఖైబర్ పక్తుంఖ్వాలో తీవ్ర ప్రభావం ఉంది. ఇప్పటి వరకు పాక్ లోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు తెలిపింది పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ.
వరదల కారణంగా పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో టమాటా, ఉల్లిపాయలను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ సర్కారు భావిస్తోంది. లాహోర్ మార్కెట్లలో కిలో టమాటా 500 రూపాయలు, కిలో ఉల్లి 400రూపాయల చొప్పున పలికాయి.
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ తల్లి మే మస్క్ ఇటీవల ఒక గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ‘ద సండే టైమ్స్’ పత్రికతో పంచుకున్నారు. కుమారుడు ఎలాన్ మస్క్ను కలిసేందుకు స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా
వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. గత 24 గంటల్లోనే 119 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
మధ్యప్రదేశ్లోని రేవా నగరంలో రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 2,000కు పైగా పందులు చనిపోయాయి.దీనితో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) సెక్షన్ 144 ప్రకారం పందుల రవాణా, కొనుగోలు మరియు వాటి మాంసం మరియు వాటి మాంసాన్ని నిషేధిస్తూ కలెక్టర్ మనోజ్ పుష్పనిషేధాజ్ఞలు జారీ చేసారు.
అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యటలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఈ నెల 25 నుంచి27 వరకు తైపీ పర్యటన చేపట్టారు.