Home / Congress Party
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలోనే పలువురు టికెట్ రాని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మాత్రం టికెట్ రాలేదని ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
భారత్ జోడో యాత్ర రెండో దశ ఈ ఏడాది డిసెంబర్ మరియు ఫిబ్రవరి 2024 మధ్య జరిగే అవకాశం ఉందని మంగళవారం కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు గత ఏడాది సెప్టెంబర్ 7 నుండి జనవరి 30, 2023 వరకు మొదటి దశ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
గద్వాల చరిత్ర చాలా గొప్పదని అటువంటి గద్వాలను గబ్బు పట్టించిందెవరో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం గద్వాల లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరువుతో అల్లాడామని అన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు, కన్నీళ్లు తప్పవని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని అయినా ఆశ్చర్యకరంగా తనకి టికెట్ నిరాకరించారని నాగం జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
: ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయాడని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్బీ నియోజక వర్గంలో నిర్వహించిన బీఆర్ఎస బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
నేడు ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హజరుకానున్నారు. జూపల్లి పొంగులేటితో పాటు పలువురు నాయకులు హస్తం గూటికి చేరటంతో పాటు. పార్టీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఈ సభతో ముగియబోతుంది.
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు.