Last Updated:

karpoori thakur: బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా పేరు పొందారు.జనవరి 24న కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

karpoori thakur: బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు  భారతరత్న

karpoori thakur: బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా పేరు పొందారు.జనవరి 24న కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

లక్ష్యాలు కొనసాగింపుకు ..(karpoori thakur)

కర్పూరీ ఠాకూర్ జీ జయంతి శతజయంతి జరుపుకుంటున్న ఈ తరుణంలో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించినందుకు సంతోషిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.సామాజిక న్యాయం కోసం పాటుపడిన గొప్ప జన్ నేత కర్పూరి ఠాకూర్ జీకి భారతరత్న ప్రధానం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించినందుకు నేను సంతోషిస్తున్నాను. అట్టడుగు వర్గాల నాయకునిగా, సమానత్వం, సాధికారత యొక్క ధృడమైన వ్యక్తిగా అతని నిరంతర ప్రయత్నాలకు గుర్తింపు లభించింది. అణగారిన ప్రజలను ఉద్ధరించడంలో అతని అచంచలమైన నిబద్ధత, అతని దార్శనిక నాయకత్వం భారతదేశ సామాజిక రాజకీయ వేదికపై చెరగని ముద్ర వేసింది. ఈ అవార్డు అతని విశేషమైన సేవలను గౌరవించడమే కాకుండా మరింత న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని సృష్టించే అతని లక్ష్యాలను కొనసాగించడానికి మాకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ రాసారు.

కర్పూరి ఠాకూర్ 1924లో సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటైన నాయి సమాజ్‌లో జన్మించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతతో ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు.అతను బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటంలో కీలక పాత్ర పోషించారు.