Last Updated:

Sachin Tendulkar: ICC T20 ప్రపంచకప్‌లో ఇండియా vs పాక్ మ్యాచ్ పై సచిన్ ఏం చెప్పాడో తెలుసా?

'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2022లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ vs పాకిస్థాన్ పోరుపై జోస్యం చెప్పాడు. అక్టోబరు 23న జరిగే మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్ అని సచిన్ అభిప్రాయపడ్డాడు.

Sachin Tendulkar: ICC T20 ప్రపంచకప్‌లో ఇండియా vs పాక్ మ్యాచ్ పై సచిన్ ఏం చెప్పాడో తెలుసా?

Mumbai: ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2022లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ vs పాకిస్థాన్ పోరుపై జోస్యం చెప్పాడు. అక్టోబరు 23న జరిగే మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్ అని సచిన్ అభిప్రాయపడ్డాడు. టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాకిస్థాన్‌ను ఓడించడానికి తగినంత శక్తిని భారత్ కలిగి ఉందని చెప్పాడు. భారతదేశం అంటే అభిమానం. అవును. నా హృదయం భారత్‌తో ఉంది. ఎల్లప్పుడూ భారత్ గెలవాలని కోరుకుంటాను. నేను భారతీయుడిని అయినందున మాత్రమే కాదు. ఈ పరిస్థితుల్లో మంచి ప్రదర్శన చేసే శక్తి మన వద్ద ఉందని నేను నిజంగా నమ్ముతున్నాను అని సచిన్ అన్నాడు.

మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్స్‌లో ఆడబోయే మొదటి నాలుగు జట్లను కూడా సచిన్ అంచనా వేసాడు. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్‌లు సెమీఫైనల్స్ కు చేరుతాయని మాస్టర్ బ్లాస్టర్ చెప్పాడు. భారత్‌కు చాలా మంచి అవకాశం ఉంది. ఈ బృందం బాగా బ్యాలెన్స్‌గా ఉంది. మంచి కాంబినేషన్ ఉంది. వాస్తవానికి, మన అవకాశాలపై నేను చాలా ఆశాజనకంగా ఉన్నాను టెండూల్కర్ జోస్యం చెప్పాడు. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022లో 16 అంతర్జాతీయ జట్లు పాల్గొంటాయి. టోర్నీలో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 13న ఫైనల్ జరగనుంది

ఇవి కూడా చదవండి: