Home / ప్రైమ్9స్పెషల్
హైదరాబాదీలను మెట్రో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మెట్రోతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చనుకుంటే, ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మెట్రోను తీసుకొస్తే, అదే మెట్రో ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది.
లాండ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్కు చెందిన సంస్థ నిర్మించినట్లు భావిస్తున్న గురుగ్రామ్లోని నిర్మాణంలో ఉన్న మాల్తో సహా రెండు డజనుకు పైగా ప్రదేశాలలో సీబీఐ బుధవారం సోదాలు నిర్వహించింది.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం కూడా ఆయుధంగా మారుతుందని, అమృత్ సర్కు చెందిన అబ్లు రాజేష్ అనే యువకుడు నిరూపించారు. తన రెండు కాళ్లూ లేకపోయినా, స్ర్పింగ్ కాళ్లతో డ్యా్న్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
ప్రైమ్9 హెడ్ ఆఫిస్ లో జరిగిన ప్రైమ్9 డిజిటల్ వెబ్ సైట్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగిగా సినీనటుడు నాగబాబు హజరయ్యారు. ప్రైమ్9 డిజిటల్ వెబ్ సైట్ ను గ్రాండ్ గా లాంచ్ చేసి, ప్రైమ్9 టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ ఎంపీగా గెలిచినా కల్వకుంట్ల కవిత పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి.పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ఇచ్చి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు స్పైస్ బోర్డు ఏర్పాటు చేసిన అరవింద్ను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. రైతులను ఎంపీపైకి ఉసిగొల్పడంతో దాడుల వరకు వెళ్లింది రాజకీయం.
సమరానికి సై అంటోంది తైవాన్. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అడుగు పెట్టిన వెంటనే చైనా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. చెప్పిన ప్రకారమే తైవాన్ తీర ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ మొదలుపెట్టింది. కయ్యానికి కాలు దువ్వింది. తైపీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించింది.
అప్గానిస్తాన్లో తాలిబన్లు పగ్గాలు చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రజల జీవితాలు మరింత దుర్భంగా మారిపోయాయి. మహిళలపై సరికొత్త ఆంక్షలు విధించడంతో ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. బాలికల చదువుపై ఆంక్షలు విధించడంతో పాటు స్కూళ్లను ధ్వంసం చేయడంతో చదువు
బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధరలు ఏకంగా 50 శాతం పెంచేసింది ప్రభుత్వం.దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడంతో భారత్ తో పాటు శ్రీలంకలో కూడా ఇటీవల భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చూశాం.
పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్ధా చటర్జీ లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు విద్యశాఖలోని ప్రతి పోస్టుకు ఒక్కొ ధర నిర్ణయించి అందిన కాడికి డబ్బు దండుకున్నాడు పార్ధుడు. ఎలాంటి అనుభవం లేని వారిని కనీస అర్హత లేని వారిని కూడా డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు పార్ధ చటర్జీ. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న ఆయన తాను అమాయకుడినని తనకు ఏమీ తెలియదని.. కాలమే అని నిర్ణయిస్తుందని అమయకత్వం నటిస్తున్నాడు.
బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్ టాప్లో ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైతే, భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్ నిలవనుంది. ఇప్పటికే ఐదు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు.