Last Updated:

Yuvagalam: యువగళం పాదయాత్రలో అపశృతి.. తారకరత్నకు గుండెపోటు

Yuvagalam: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గరుయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ పాదయాత్ర చేపట్టారు.

Yuvagalam: యువగళం పాదయాత్రలో అపశృతి.. తారకరత్నకు గుండెపోటు

Yuvagalam: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గురయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ పాదయాత్ర చేపట్టారు.

కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో.. తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే గమనించిన తెదేపా కార్యకర్తలు ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ వైద్యులతో మాట్లాడారు. మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతి లేదా బెంగళూరు ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆస్పత్రికి చేరుకున్న బాలకృష్ణ.

మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న బాలకృష్ణ.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన జూనియర్ ఎన్టీఆర్.

బాలకృష్ణకు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులు తెలుసుకున్న ఎన్టీఆర్.

కుప్పం నియోజకవర్గంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి యువగళం  యాత్ర ప్రారంభమైంది.

ఈ యాత్రలో నటుడు తారకతర్న కూడా పాల్గొన్నారు. ఈ పాదయాత్ర ప్రారంభమైన కాసేపటికే.. లోకేష్ మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్‌ (Nara Lokesh ) తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు.

మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. తెదేపా కార్యకర్తలు, అభిమానుల తాకిడికి సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తుంది.

వైద్యులతో మాట్లాడిన అనంతరం బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందుతున్నట్లు తెలిసింది.

ఆందోళనలో తెదేపా కార్యకర్తలు

తారకరత్నకు గుండెపోటు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అత్యవసర వైద్యసేవలు అందించాల్సి వస్తే.. తారకరత్నకు తిరుపతి లేదా బెంగళూరు తరలించే అవకాశం ఉంది.

తారకరత్న త్వరగా కోలుకోవాలని తెదేపా అభిమానుల ఆకాంక్ష.

2009 ఎన్నికల ప్రచారంలో ఇలాగే జూనియర్ కు ప్రమాదం.

ఇప్పుడు తారకరత్న అస్వస్థతకు గురవ్వడంతో తెదేపా నేతల్లో ఆందోళన.

నాలుగు రోజులుగా విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తున్న తారకరత్న.

కెసి హాస్పిటల్ కు తరలించే సమయానికే పల్స్ లేదన్న వైద్యులు.

పరిస్థితి విషమంగానే ఉందంటున్న వైద్యులు.

మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించే ఛాన్స్.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/