Home / పొలిటికల్ వార్తలు
మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ సెప్టెంబరు 19న బీజేపీలో విలీనం కానుంది. గత ఏడాది చివర్లో సీఎం పదవి నుండి తొలగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన అమరీందర్ సింగ్ కొత్త రాజకీయ పార్టీ- పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పిఎల్ సి )ని స్థాపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తింపును ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించాలని మరియు ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపించడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దాని చిహ్నాన్ని రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్కు లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి సాయంత్రం వరకు డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ప్రజా స్రవంతిలో ధరలు కట్టడి అనేది ఏ ప్రభుత్వానికైనా ఎంతో ముఖ్యం. దానిపై పాలక ప్రతిపక్షాల మద్య నిత్యం మాటలు యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాని నేడు ఆదిశగా ప్రభుత్వాల అడుగులు పడడం లేదు. కేవలం ప్రతిపక్షానికి మేము ఏం జవాబు చెప్పేది అన్న కోణంలో సాగుతున్నట్లుగా శాసనసభా సమావేశాల తీరు ఉందని ఏపి అసెంబ్లీ సమావేశాలు రుజువుచేస్తున్నాయి
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాకారుడు రాజు తెలంగాణ తల్లి విగ్రహనికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్ధితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుంది. ఆయన తీసుకొనే నిర్ణయాలు సీనియర్లకు ఇష్టం లేని కారణంగా ప్రతి విషయాన్ని రాద్ధాంతం దిశగా వారు నడిపిస్తున్నారు
అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టాలంటే వందేళ్లైన పూర్తికాదని, కేవలం కలలో మాత్రమే ఊహించుకోవచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేసారు. అసెంబ్లీలో జగన్ పాలన వికేంద్రీకరణపై ప్రసంగించారు
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది.
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు చెందినఒకే ఇంటి నంబర్ పై 532 ఓట్లు నమోదయ్యాయి. ఆర్టీఐ చట్టం కింద ఖమ్మం కలెక్టరేట్ నుంచి కార్యకర్త కొయ్యిని వెంకన్న ఈ మేరకు వివరాలు సేకరించారు. మమత హాస్పిటల్ రోడ్డులోని గొల్లగూడెం ఏరియాలో 5-7-200 నంబర్ వున్న ఇంట్లో ఈ ఓట్లు నమోదయ్యాయి. Over 530 voters listed on minister Ajay Kumar's house number.
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు