Home / పొలిటికల్ వార్తలు
ఏపీలో భాజపాకు తోడుగా ఉండేది జనసేనేనని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం జాప్యానికి అధికార వైకాపా, గత టీడీపీ ప్రభుత్వాలే కారణమంటూ కొత్తగా ఆరోపించారు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను బలిసిన పాదయాత్రగా అభివర్ణించిన వైకాపా నేతలకు పాదయాత్రలోని మహిళలు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అవకాశం మేరకు సాయం చేయండి, లేదా మూసుకొని కూర్చోండి అంటూ హితవు పలికారు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటివరకూ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య పోటీ ఉంటుందని, ఇందులోనూ అధిష్టానం ఆశీస్సులున్న గెహ్లాట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమేనని అంతా భావించారు.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 18వ రోజుకు చేరింది. ఈ నెల 10న కేరళలో ప్రవేశించిన రాహుల్ పాద యాత్ర నేడు వాయనాడ్ నియోజకవర్గంలో ప్రవేశించింది. కేరళలో రాహుల్ పాదయాత్ర 450 కి.మీమేర సాగనుంది
రైతు మోటార్లకు మీటర్లు బిగిస్తే బిగించేవాడి చేతులు నరకుతామంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో రైతు సదస్సులో పాల్గొన్న ఆయన రాజన్న పాలన తెస్తానని రాజన్న మాటకి సీఎం జగన్ పంగ నామాలు పెట్టారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో విలువైన ఇనుప ఖణిజాలను పరులు పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందని, ఏపి ఎండీసి ద్వార ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ఓబులాపురం గనుల దోపిడి పార్ట్ 2 ప్లాన్ కు వైకాపా ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు
ఆర్ఎస్ఎస్ ను మూడు సార్లు నిషేధించారు. అయినా పనితీరు ఆగలేదు. సిమీని బ్యాన్ చేస్తే ఏం జరిగిందో చూడండి. నిషేధించడమే పరిష్కారానికి మార్గం కాదని, అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలకాలి, బుల్ డోజర్ రాజకీయాలను నిలిపివేయాలి అంటూ సీపీఐ-ఎం నేత సీతారం ఏచూరి పేర్కొన్నారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిందన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై విరుచుకుపడ్డారు.
జాతీయపార్టీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ వేగంగా అడుగులేస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ప్రకటన పై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెరాశ పార్టీ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను పున: పరిశీలన చేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు సర్వోత్తమ న్యాయస్ధానం సూచించింది