Home / పొలిటికల్ వార్తలు
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈనెల 24వ తేదీ నుంచి తెలంగాణలో మొదలుకానుంది. దీనికి సంబంధించి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేశారు.
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్లోని విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు శనివారం వచ్చారు. హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో అతను లేకపోవడంతో అతని సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
తమ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్రావు, కేసీఆర్కు లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పై చర్చకు సిద్దమా అని హరీష్రావుకు సవాలు విసిరారు. హరీశ్ రావు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకో. మమ్మల్ని పోల్చాల్సిన అవసరం లేదు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.
రాహుల్ గాంధీ సారధ్యంలో సాగుతున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కేవలం ఎన్నికల కోసమే కాదని, దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న యాత్రంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. నాలుగు పాదయాత్రలకు భిన్నంగా ఈసారి, నిత్యం రెండు వర్గాల మధ్య అలర్లు జరిగే ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభించడం ఉత్కంఠ రేపుతోంది.
వైసీపీ ఫైర్ బ్రాండ్కు ఏమైంది? కొడాలి నాని ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? జగన్ సర్కార్ నిర్ణయాల పై కొడాలి నాని అసంతృప్తితో ఉన్నారా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టినా, అన్నగారి వీరాభిమాని ఎందుకు స్పందించడం లేదు.
ఏపీ ప్రభుత్వ పనితీరు నానాటికి దిగజారిపోతుంది. నిత్యం ఎక్కడో ఓ చోట విధ్వంశాలు, కొట్లాటలు, మాటల తూటాలు, అసభ్యకరమైన స్ననివేశాలు. తాజాగా ఓ మంత్రి సమక్షంలోనే నాటు సారా గుప్పుమనింది. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసు యంత్రాంగం, చోధ్యానికే పరిమితమైన ఆ ఘటన డోన్ లో చోటుచేసుకొనింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు. వారి వారి ఆలోచనల మేరకు పాలన ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే మేం కూడా పరుషంగా మాట్లాడగలం. సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే అందుకు మేము రెడీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి సీనియన్ నాయకుడు దిగ్విజయ్సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. శశిథరూర్లు మాత్రమే ఒకరితో ఒకరు తలపడుతున్నారు.