Home / జాతీయం
డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు డిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సీమాను కలిసేందుకు వారానికి ఒకసారి అనుమతించింది. అది ఈడీ, సీబీఐ అధికారులు సమక్షంలోనే మాత్రమే అని షరుతు విధించింది.
ఎట్టకేలకు అమెథీ, రాయబరేలీ లోకసభ నియోజకవర్గాల్లో ఎవరూ పోటీ చేస్తారనే సస్పెన్స్ తెరపడింది. రాహుల్ గాంధీ అమెధీ నుంచి కాకుండా తన తల్లి నియోజకవర్గం అయిన రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనదైన శైలిలో రాహుల్గాంధీపై సెటైర్లు విసిరారు. 'డరో మత్, బాగోమత్" అంటూ ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే 400 పై చిలుకు సీట్లు సాధిస్తామనేది ఆయన ధీమా. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ మాత్రం 400 పార్ ఓ పెద్ద జోక్, 300 పార్ అసంభవం.. 200 పార్ అతి పెద్ద చాలెంజ్ అని అన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మహిళా రెస్లర్లను లైంగికంగా వేధించాడని ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో క్రీడాకారులంతా ఆయనను అరెస్టు చేయాలని, ఆయన చేతిలో తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ప్రధాని నుంచి హోంమంత్రి వరకు ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో సెక్స్ స్కాండల్లో కూరుకుపోయిన జెడి ఎస్యుతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని మాస్ రెపిస్టు కోసం ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. క
డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకె సక్సేనా డిల్లీ కమిషన్ ఫర్ విమెన్పై (డీసీడబ్ల్యు) పై కన్నెర్ర జేశారు. స్వాతిమలీవాల్ డీసీడబ్ల్యు చైర్పర్సన్గా ఉన్నప్పుడు .. ఫైనాన్స్డిపార్టుమెంట్ కానీ.. లేదా అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా 233 మందిని దిల్లీ కమిషన్ ఫర్ విమెన్లో ఉద్యోగులను నియమించారు.
కర్ణాటక సెక్స్ టేప్ల కేసు మరింత జటిలం అవుతోంది. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ్ మనవడు పలువురు మహిళలో జరిపిన రాసలీల టేపు ప్రస్తుతం కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. గత నెల 26న లోకసభ ఎన్నికల పోలింగ్ మగిసిన వెంటనే ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీ పారిపోయాడు. కాగా ఆయనపై గ్లోబల్ లుక్ అవుట్నోటీసు జారీ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలోని యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశానికి సంబంధించిన సమాచారం టెర్రరిస్టులకు ఇచ్చి విధ్వంసం సృష్టించేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్కు విడదీయరాని సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోదీ. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి ప్రార్థనలు చేస్తోందన్నారు .
ఇండియా కూటమిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ లా కనిపిస్తోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో సీట్ల సర్దుబాటు విషయంలో మమతా బెనర్జీకి.. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది.
కర్ణాటకలో ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండిల్ హాట్ టాపిక్గా మారింది. అయితే స్కాండిల్ వెలుగు చూసిన వెంటనే ప్రజ్వల్ దేశం నుంచి జర్మనీకి పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ తొలిసారి ఒక ప్రకటన విడుదల చేశాడు. వాస్తవాలు నిలకడగా వెలుగు చూస్తాయని, తాను అమాయకుడినని ప్రకటనలో పేర్కొన్నాడు.