Home / జాతీయం
జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్ కేసులో హిందూ పక్షం పిటిషన్ను కొనసాగించడాన్ని వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం సమర్థించింది.
బెంగుళూరులో భారీ వరదల కారణంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. డాక్టర్ గోవింద్ నందకుమార్, గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ మణిపాల్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో సర్జాపూర్-మరాతహళ్లి మార్గంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు. తన ప్రయాణంలో, అతను తన వాహనం నుండి దిగి, పరిగెత్తాడు. ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది.
కారులో 6 ఎయిర్బ్యాగ్లు ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన పోస్ట్ సంచలనం సృష్టించింది. వీడియోలో కనిపిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా రాజకీయ నాయకులు మరియు సోషల్ మీడియా వినియోగదారుల విమర్శలకు గురయ్యారు.
కాంగ్రెస్ సోమవారం తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఖాకీ షార్ట్లను తగులబెట్టిన చిత్రాన్ని పోస్ట్ చేయడంతో రాజకీయ వివాదం చెలరేగింది. పోస్ట్ చేసిన చిత్రంలో, ఆర్ఎస్ఎస్ నిక్కర్ కాలుతూ దాని నుండి పొగ కూడా పైకి లేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ని ప్రారంభించారు. ఈ సమ్మిట్ను ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్లు సంయుక్తంగా గ్రేటర్ నోయిడా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇక్కడి ఎగ్జిబిషన్ను కూడా ప్రధాని ఆసక్తికరంగా పరిశీలించారు.
దేశవ్యాప్తంగా మద్య నిషేద చట్టాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం విముఖుత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు తమకు తాముగా నియంత్రిస్తున్నందున, దేశ వ్యాప్తంగా మద్యపాన నిరోధక విధాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు అధికారులు తెలిపారు.
సోనాలి ఫోగట్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు గోవా ప్రభుత్వం సోమవారం సిఫారసు చేసింది. ఆదివారం, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిసారు.
ఢిల్లీ ప్రభుత్వం 1,000 బస్సులను కొనుగోలు చేయడంలో జరిగిన అవినీతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తుకు రంగం సిద్దమయింది. జూన్లో అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్కుమార్ సీబీఐ దర్యాప్తుకు విజ్ఞప్తి చేశారు.
జ్ఞాన్వాపి మసీదు మరియు దాని చుట్టుపక్కల భూముల పై దాఖలయిన సివిల్ దావాల పై వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. ఈ నేపధ్యంలో వారణాసిలో నిషేధాజ్ఞలు కఠినతరం చేయబడ్డాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.