Home / జాతీయం
2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతెలిపారు.మేము 2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జీ 20 సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అందరు G20 సదస్సుని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు, అతను వయనాడ్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగితే, అమేథీ పట్టిన గతే ఈ నియోజకవర్గానికి పడుతుందని హెచ్చరించారు.
లండన్లోని భారత హైకమిషన్పై ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల దాడి చేసిన సంఘటనపై విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) బృందం సోమవారం (మే 22) యునైటెడ్ కింగ్డమ్ రాజధానికి బయలుదేరింది.
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. జీ20 సమ్మిట్లో ఓ సినిమా సెలబ్రిటీ పాల్గొనడం అరుదైన విషయం. మే 22 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జీ20 సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రాత్రి ట్రక్కు డ్రైవర్లను సందర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకు, వారి మన్ కీ బాత్ వినేందుకు వెళ్లారు. పార్టీ ట్వీట్ చేసిన విజువల్స్లో, గాంధీ ట్రక్కులో కూర్చొని, డ్రైవర్లలో ఒకరితో ప్రయాణిస్తూ మరియు ట్రక్ డ్రైవర్లతో మాట్లాడుతూ కనిపించారు.
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. కస్టడీలో సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఓ పురుగుమందుల కంపెనీ, మరికొన్ని సంస్థలు నాసిరకం మందులను అందిస్తున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని హింగోలిలో స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు సోమవారం రోడ్లపై కరెన్సీ నోట్లు విసిరి ప్రత్యేక నిరసన చేపట్టారు.
నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీ తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 12 వేల 828 గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రసారం చేసిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పై గుజరాత్కు చెందిన ఎన్జీవో 10,000 కోట్ల నష్టపరిహారం కోసం దావా వేసింది. డాక్యుమెంటరీ ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలను చేస్తోందని ఎన్జీవో పేర్కొంది.