Home / జాతీయం
Credit cards: రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై విచారణకు సంబంధించి ఇండియా ఎహెడ్ న్యూస్ యొక్క వాణిజ్య అధిపతి మరియు ప్రొడక్షన్ కంట్రోలర్ అరవింద్ కుమార్ సింగ్ ను సీబీఐ అరెస్టు చేసింది.గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంస్థకు హవాలా మార్గాల ద్వారా రూ. 17 కోట్లు బదిలీ చేశారన్న ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఒడిశాలోని గోపీనాథ్పూర్లోని గోపీనాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడి ఆభరణాలను దొంగిలించిన ఓ దొంగ 9 ఏళ్ల తర్వాత వాటిని తిరిగి ఇచ్చాడు. వీటిని దేవాలయం వద్ద వదిలిపెట్టిన దొంగ తన పేరును చెప్పకుండా ఒక లేఖ కూడా రాసాడు.
SBI Jobs: ఎస్బీఐలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మరో మూడు రోజులే గడువు ఉండటంతో.. అభ్యర్ధులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ సూచిస్తోంది.
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా దీనిని నిర్మించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకునే సమయంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ఈ నెలాఖరులో ప్రారంభిస్తారని సమాచారం.
ఉద్యోగం కోసం భూమి కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకులు కిరణ్ దేవి మరియు ప్రేమ్ చంద్ గుప్తాకు చెందిన అనేక రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు "అడివి శేష్". 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. ఆ మూవీ లో అడవి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో కర్ణాటకలోని చిత్రదుర్గ గ్రామస్థులు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సోమవారం తెలిపారు. దీనికి సంబంధించి మాల్వియా ఒక వీడియోను పంచుకున్నారు.
రోజ్గార్ మేళా కింద, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మంగళవారం కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ప్రతి పథకం మరియు ప్రతి విధానం యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని అన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు ఇవాళ సమన్లు జారీ చేసింది. 100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది.