Home / జాతీయం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించారు. 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పూణె వైమానిక దళ స్థావరం నుండి ఫ్రంట్లైన్ సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్లో ప్రయాణించారు. దీనితో ముర్ము యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండవ మహిళా దేశాధినేత అయ్యారు.
హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనకు వెయ్యిమంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఈ ఇరు పార్టీల నడుమ పచ్చగడ్డివేస్తే భగ్గు మనేలా మాటల తూటాలు పేలూతూ ఉంటోన్నాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కేంద్రం, ఎమ్మెల్సీ కవితను ముప్పుతిప్పులు పెడుతుండగా.. మరోవైపు తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం కేంద్ర రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
ఖలిస్తానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది.
Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చులను వివిధ కేటగిరీల్లోకి వస్తాయి. మనం ఎక్కువ షాపింగ్ చేస్తే.. షాపింగ్ కార్డు ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిపై రాయితీ లభిస్తుంది. దీనికి తగినట్లుగానే.. వినియోగదారులు కార్డ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలి.
హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని బోటాడ్ జిల్లాలోని సారంగపూర్ ఆలయంలో 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా నేడు గుజరాత్లో పర్యటించారు.
ఆక్స్ఫామ్ ఇండియా మరియు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (CPR) కార్యాలయాలపై విదేశీ సహకార నియంత్రణ చట్టం ఉల్లంఘనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు కేంద్రం గురువారం ఆదేశించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన బిబిసి డాక్యుమెంటరీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ పార్టీలో కలకలం సృష్టించడంతో ఆయన కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు గురువారం ముగియడంతో పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు 'తిరంగా మార్చ్' చేపట్టారు. ఈ మార్చ్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వమే పార్లమెంట్ను నడపనివ్వడం లేదు.. అదానీ స్కాంపై ఎందుకు చర్చకు ఇష్టపడడం లేదని ప్రశ్నించారు.
సికింద్రాబాద్ మరియు తిరుపతి, చెన్నై మరియు కోయంబత్తూరు మధ్య రెండు కొత్త వందే భారత్ రైళ్లను ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు, దీనితో దేశవ్యాప్తంగా నడుస్తున్న ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్ల సంఖ్య 13కి చేరుకుంది.