Home / జాతీయం
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమావేశం అనంతరం ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాజస్థాన్లో కాంగ్రెస్ వర్గాలకతీతంగా ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఇద్దరూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అంగీకరించినట్లు వేణుగోపాల్ తెలిపారు.
ణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి కూడా ఉద్యోగం కల్పిస్తామన్నారు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. బీజేపీ పదవీకాలం దేశానికి సేవగా భావించిన ప్రధాని మోదీ ప్రతి నిర్ణయం మరియు ప్రతి చర్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి రూపొందించబడినట్లు తెలిపారు.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి సమీపంలో మంగళవారం బస్సు లోయలో పడి పది మంది మృతి చెందగా, 55 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 75 మంది ప్రయాణికులతో బస్సు అమృత్సర్ నుంచి కత్రాకు వెడుతోంది.
పశ్చిమ బెంగాల్లో సాగర్డిఘి అసెంబ్లీ స్దానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. మూడు నెలల ఊహాగానాల తర్వాత, పుర్బా మేదినీపూర్లోని ఘటోలాలో సోమవారం జరిగిన వేడుకలో ఆయన అధికారికంగా పార్టీలో చేరారు
ఈ ఏడాది జూలైలో చంద్రయాన్-3ని ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ సోమవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి రెండవ తరం నావిగేషన్ ఉపగ్రహం NSV-01 విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేసారు.
దేశరాజధాని ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను ఒక యువకుడు 40 సార్లు కత్తితో పొడిచి బండరాయితో తలపై మోది చంపాడు. రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ అడ్డుకోవడానికి ముందుకు రాలేదు. ఈ దారుణ హత్య సీసీటీవీలో రికార్డయింది. మృతురాలిని షహబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీకి చెందిన సాక్షిగా గుర్తించారు.
మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు.ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్లో పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది
ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్లు మరియు ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్తలపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది.